Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీరూ చెలరేగాడు.. రోహిత్ శర్మ బ్రేక్ చేశాడు.. అదే భారత అత్యధిక స్కోరు..

భారత్-విండీస్ మధ్య జరిగిన నాలుగో వన్డే డిసెంబర్ 8, 2011 జరిగింది. ఈ వన్డేలో డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చెలరేగిపోయాడు. తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. విండీస్ బౌలర్లకు తన బ్యాటింగ్‌తో చుక్కలు

Webdunia
శుక్రవారం, 8 డిశెంబరు 2017 (11:36 IST)
భారత్-విండీస్ మధ్య జరిగిన నాలుగో వన్డే డిసెంబర్ 8, 2011 జరిగింది. ఈ వన్డేలో డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చెలరేగిపోయాడు. తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. విండీస్ బౌలర్లకు తన బ్యాటింగ్‌తో చుక్కలు చూపించాడు. స్టేడియం నలువైపులా బౌండరీలు బాదుతూ వీర విహారం చేశాడు. మొత్తం 149 బంతులాడిన సెహ్వాగ్ 25ఫోర్లు, ఏడు సిక్సర్లతో ఏకంగా 219 పరుగులతో డబుల్ సెంచరీ చేశాడు. ఇది వన్డే కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీతో ప్రపంచ రికార్డును సృష్టించాడు. 
 
వన్డేల్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును అధికమించి.. డబుల్ సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అంతేకాదు.. అప్పటికి అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన క్రికెటర్‌గా కూడా సెహ్వాగ్ తన పేరును నమోదు చేసుకున్నాడు. ఈ రికార్డును కొన్నాళ్లకు టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ 264 పరుగులతో సెహ్వాగ్ రికార్డును బ్రేక్ చేశాడు. 
 
సెహ్వాగ్ వీర విహారం చేసిన ఈ మ్యాచ్‌లో భారత్ 153 పరుగుల తేడాతో విండీస్‌పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ మొత్తం 418 పరుగులు చేసింది. భారత జట్టు చేసిన అత్యధిక స్కోరు కూడా ఇదే కావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

తర్వాతి కథనం
Show comments