Webdunia - Bharat's app for daily news and videos

Install App

కివీస్ టెస్టు ఓటమి గురించి అతిగా ఆలోచించను -కోహ్లీ

Webdunia
సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (17:29 IST)
న్యూజిలాండ్ పర్యటనలో వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పది వికెట్ల తేడాతో భారత్ పరాజయం పాలైంది. మ్యాచ్ ఓటమి తర్వాత కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ.. టాస్ గెలుచుకోలేకపోవడం చాలా కీలకమైందని.. ఓటమికి అదొక కారణమని పోటీ ఇవ్వలేకపోయినట్లు చెప్పాడు. తొలి టెస్టులో భారత్ పరాజయంపై ప్రజల స్పందన గురించి తాను అతిగా ఆలోచించనని కోహ్లీ వెల్లడించాడు. ఒకవేళ తాను బయటి వ్యక్తుల్లా ఆలోచిస్తే.. ఇప్పుడు తాను కూడా జట్టు నుంచి బయట ఉండేవాడిని అని కోహ్లీ పేర్కొన్నాడు. 
 
'తొలి రోజు టాస్ అనుకూలంగా పడటమనేది చాలా ముఖ్యం. బ్యాటింగ్ విభాగం ఎంత కష్టపడినప్పటికీ తగినంత పోటీ ఇవ్వలేకపోయాం. కివీస్ బౌలర్లను ఒత్తడిలోకి నెట్టామని మేం అనుకోవడం లేదు. 220-230కు మించిన స్కోరు చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. మొదటి ఇన్నింగ్సే వెనక్కిపడేలా చేసి ఒత్తిడిలోకి నెట్టేసింది' అంటూ కోహ్లీ వివరణ ఇచ్చాడు. 
 
కాగా.. తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది న్యూజిలాండ్. మూడో రోజు ఆట ముగిసే సరికి 65 ఓవర్లలో 4 వికెట్లకు 144 పరుగులు చేసిన భారత్.. నాల్గో రోజు బ్యాటింగ్ కొనసాగించి రెండో ఇన్నింగ్స్ లో 191 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 58 పరుగులతో మయాంక్ అగర్వాల్, 29 పరుగులతో రహానే, 25 పరుగులతో పంత్ పర్వాలేదనిపించినా.. మిగతా ఆటగాళ్లు కనీస ఆటతీరును కనబర్చలేకపోవడంతో.. 191 పరుగులతోనే సరిపెట్టుకుంది టీమిండియా. 
 
కివీస్ బౌలర్లలో సౌథీ 5/61, బౌల్ట్ 4/39తో భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కుప్పకూల్చారు.. 9 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు... ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా విజయాన్ని సాధించింది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments