ఇండియన్ ప్రీమియర్ లీగ్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు లిక్కర్ కింగ్గా పేరు గాంచిన యునైటెడ్ బ్రూవరీస్ అధినేత విజయ్ మాల్యాను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది. చివరకు తన వ్యక్తిగత ప్రయాణాల కోసం ముచ్చటపడి కొనుగోలు చేసిన చిన్న విమానాన్ని కూడా ఆయన వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా విజయ్ మాల్యాకు సుప్రీం కోర్టు గట్టి ఎదురుదెబ్బే తగిలింది.
యునైటెడ్ బ్రూవవీస్ నిధుల పంపిణీలో భారీ అవకతవకలు జరిగాయన్న బహుళజాతి సంస్థ డియోజియో ఫిర్యాదు నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. మాల్యా కంపెనీల ఆర్థిక కార్యకలాపాలపై దర్యాప్తునకు ఈడీ అధికారులు దాదాపుగా రంగం సిద్ధం చేసుకున్నారు.
అయితే దీనిపై భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించిన మాల్యా, ఈడీ విచారణను నిలిపివేయాలని పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ను విచారించిన సుప్రీంకోర్టు మాల్యా అభ్యర్థనను తోసిపుచ్చింది. మాల్యా సంస్థలపై ఈడీ దర్యాప్తును నిలిపివేయజాలమని సుప్రీం ధర్మాసనం తేల్చింది.