Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరు జట్టును అమ్మకానికి పెట్టిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా

Webdunia
గురువారం, 2 జులై 2015 (10:22 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ఇండియన్ లిక్కర్ కింగ్‌గా పేరున్న కింగ్ ఫిషర్ ఎయిర్‌ లైన్స్ అధినేత విజయ్ మాల్యా అమ్మకానికి పెట్టనున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఒక్కో సంస్థ నుంచి తప్పుకుంటూ వస్తున్న విజయ్ మాల్యాకు చెందిన జట్టును జిందాల్ గ్రూపునకు చెందిన జేఎస్ డబ్ల్యూ స్టీల్ కొనుగోలు చేయనున్నట్టు తెలుస్తోంది. 
 
తాము ఒక ఐపీఎల్ టీమును కొంటున్నామని జేఎస్ డబ్ల్యూ స్టీల్ చైర్మన్ సజ్జన్ జిందాల్ తెలిపారు. ఇండియాలో నంబర్ వన్ క్రీడగా ఉన్న క్రికెట్‌కు సంబంధించి ఒక ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. డబ్బులు తమకు సమస్య కాదని.. గుర్తింపు కోసమే జట్టును కొనుగోలు చేశామని చెప్పారు. 
 
కాగా, విజయ్ మాల్యా 2008లో ఐపీఎల్ పోటీలను ప్రకటించి, ఫ్రాంచైజీలను విక్రయానికి ఉంచినప్పుడు బెంగళూరు జట్టును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ 8 సార్లు ఐపీఎల్ పోటీలు జరుగగా, బెంగళూరు జట్టు ఒక్కసారి కూడా చాంపియన్‌గా నిలవకపోవడం గమనార్హం.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments