Webdunia - Bharat's app for daily news and videos

Install App

సురేశ్ రైనా బంధువులపై దోపిడీ.. మోస్ట్ వాంటెడ్‌ను ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులు

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2023 (19:55 IST)
టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా బంధువులు దోపిడీ దొంగల దాడిలో మృతి చెందిన ఘటన మూడేళ్ల క్రితం ఐపీఎల్ సందర్భంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీంతో రైనా ఐపీఎల్‌కు దూరమయ్యాడు. పంజాబ్‌లోని థరియాల్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
రైనా మామయ్య అశోక్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దోపీడీ దొంగలు దాడి చేసారు. ఈ ఘటనలో అశోక్ కుమార్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆయన భార్య, కుమారులు ఆస్పత్రి పాలయ్యారు. 
 
కుమారుడు కౌశల్ చికిత్స పొందుతూ మరణించగా, భార్య, మరో కుమారుడు కోలుకున్నారు. ఈ కేసులో నిందితుడైన రషీద్‌ను పోలీసులు మోస్ట్ వాంటెడ్‌గా ప్రకటించారు.
 
గత మూడేళ్లుగా అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో యూపీలో రషీద్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. రషీద్ పోలీసులపై దాడికి యత్నించడంతో, ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసు ఉన్నతాధికారులు వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వంశీకి ఆయుష్‌లో ముగిసిన చికిత్స - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Jagan: క్రిమినల్స్‌ను జగన్ ఓదార్చుతారా? ఎలాంటి సందేశం పంపుతున్నారు?: అనిత

కదులుతున్న రైల్లో నా రీల్ చూడండి, చేయి పోవచ్చు, కాలు పోవచ్చు, చనిపోవచ్చు (video)

Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన బాబు, పవన్

కేసీఆర్ కుమార్తె కవిత ఓ లేడీ డాన్.. చేయని దందా లేదు : మధుయాష్కీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

తర్వాతి కథనం
Show comments