Webdunia - Bharat's app for daily news and videos

Install App

సురేశ్ రైనా బంధువులపై దోపిడీ.. మోస్ట్ వాంటెడ్‌ను ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులు

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2023 (19:55 IST)
టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా బంధువులు దోపిడీ దొంగల దాడిలో మృతి చెందిన ఘటన మూడేళ్ల క్రితం ఐపీఎల్ సందర్భంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీంతో రైనా ఐపీఎల్‌కు దూరమయ్యాడు. పంజాబ్‌లోని థరియాల్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
రైనా మామయ్య అశోక్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దోపీడీ దొంగలు దాడి చేసారు. ఈ ఘటనలో అశోక్ కుమార్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆయన భార్య, కుమారులు ఆస్పత్రి పాలయ్యారు. 
 
కుమారుడు కౌశల్ చికిత్స పొందుతూ మరణించగా, భార్య, మరో కుమారుడు కోలుకున్నారు. ఈ కేసులో నిందితుడైన రషీద్‌ను పోలీసులు మోస్ట్ వాంటెడ్‌గా ప్రకటించారు.
 
గత మూడేళ్లుగా అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో యూపీలో రషీద్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. రషీద్ పోలీసులపై దాడికి యత్నించడంతో, ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసు ఉన్నతాధికారులు వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడితో కలిసివుండేందుకు సొంతిల్లు నిర్మించుకోవాలని కన్నబిడ్డ కిడ్నాప్!!

స్నానానికి పనికిరాని గంగానది నీరు.. చేపల పెంపకానికి భేష్!!

డీకే శివకుమార్ సీఎం కాకుండా ఎవరూ అడ్డుకోలేరు : వీరప్ప మొయిలీ

వంద డిగ్రీల వేడిలో చికెన్ ఉడికించి ఆరగిస్తే బర్డ్ ఫ్లూ సోకదా?

పార్టీ మారే డీఎన్ఏ తన రక్తంలోనే లేదు : డీకే శివకుమార్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram: దిల్ రూబా స్టోరీ లైన్ చెప్పు, బైక్ గిఫ్ట్ కొట్టు : కిరణ్ అబ్బవరం

సినిమా ప్రశాంతతను కలిగించాలి, అసహ్యం కలిగించకూడదు : వెంకయ్య నాయుడు

ఆస్కార్ 2025 విజేతలు వీరే : భారతీయ చిత్రం అనూజకు అవార్డు దక్కిందా?

బ్రాండ్ అంబాసిడర్‌గా మీనాక్షి చౌదరినా? ఫ్యాక్ట్ చెక్

ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్ జంటగా కొత్త చిత్రం

తర్వాతి కథనం
Show comments