Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేపీఎల్‌: నో బాల్ చెప్పాడని అంపైర్ చెల్లెల్ని చంపేసిన క్రికెటర్ సందీప్ పాల్!

Webdunia
మంగళవారం, 31 మే 2016 (11:01 IST)
జరారా ప్రీమియర్ లీగ్ (జేపీఎల్) ఈ నెల 14 నుంచి 30వ తేదీ వరకు క్రికెట్ పోటీలు జరిగాయి. గెలిచిన జట్టుకు రూ.5,100 బహుమతి ప్రకటించారు. ఈ నెల 28న జరారా, బరికి జట్ల మధ్య జరిగిన పోరు మాత్రం విషాదానికి దారి తీసింది. అంపైర్ రాజ్ కుమార్ జీవితంలో పెను విషాదానికి కారణమైంది.

అంపైర్ రాజ్ కుమార్ నో బాల్ అంటూ ప్రకటించడంతో క్రికెటర్ సందీప్ పాల్‌ కోపంతో రగిలిపోయాడు. వెంటనే రాజ్ కుమార్ దగ్గరికి వెళ్ళి, గొడవకు దిగాడు. నో బాల్ కాదని చెప్పమన్నాడు. కానీ రాజ్ కుమార్ వినలేదు. దీంతో నీ సంగతేంటే చూస్తానంటూ హెచ్చరించాడు. 
 
ఇవన్నీ మామూలేనని రాజ్ కుమార్ తేలిగ్గా తీసుకున్నాడు. అయితే సందీప్ పాల్ చెప్పినట్టే  ఈ నెల 29న అంపైర్ రాజ్ కుమార్ చెల్లి పూజ (15), మరో ముగ్గురు స్నేహితురాళ్ళు పొలానికి వెళ్తూండగా సందీప్ కూల్ డ్రింక్స్ ఇచ్చాడు. వాటిని తాగిన పూజ మృతి చెందగా, మిగిలిన ముగ్గురూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సందీప్‌ను పూజకు, ఆమె స్నేహితురాళ్ళకు బాగా తెలుసు. అందుకే నమ్మకంగా కూల్ డ్రింక్స్ తాగేశారు.
 
జేపీఎల్ ఖెయిర్ క్రికెట్ కమిటీ అధ్యక్షుడు బాబీ ఖాన్ మాట్లాడుతూ.. గ్రామ పెద్దల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ, వారందర్నీ ఒప్పించి ఈ టోర్నమెంటును నిర్వహించామన్నారు. చివరికి ఇలా జరగడం చాలా విచారకరమని చెప్పారు. పూజ మృతిపైనా, నలుగురు అమ్మాయిలకు విషం ఇవ్వడంపైనా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments