Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉఫ్... నరాల తెగే ఉత్కంఠ... హమ్మయ్య కోహ్లి సేన గెలిచింది... 5 పరుగుల తేడాతో....

భారత్ - ఇంగ్లాండు జట్ల మధ్య నాగపూర్లో జరిగిన రెండో టీ20లో భారత్ నరాల తెగే ఉత్కంఠ మధ్య ఇంగ్లాండును 5 పరుగుల తేడాతో ఓడించింది. ఇంగ్లాండు ముందు 145 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచిన టీమ్ ఇండియాకు ఇంగ్లాండు బ్యాట్సమన్లు రూట్(38), స్టోక్స్(38) చుక్కలు చూపించా

Webdunia
ఆదివారం, 29 జనవరి 2017 (23:11 IST)
భారత్ - ఇంగ్లాండు జట్ల మధ్య నాగపూర్లో జరిగిన రెండో టీ20లో భారత్ నరాల తెగే ఉత్కంఠ మధ్య ఇంగ్లాండును 5 పరుగుల తేడాతో ఓడించింది. ఇంగ్లాండు ముందు 145 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచిన టీమ్ ఇండియాకు ఇంగ్లాండు బ్యాట్సమన్లు రూట్(38), స్టోక్స్(38) చుక్కలు చూపించారు. ఐతే బుమ్రా, నెహ్రాల దెబ్బకు ఇద్దరూ అవుట్ కావడంతో ఇండియా ఊపిరి పీల్చుకుంది. ఇంతలో బట్లర్ ప్రమాదకరమైన బ్యాట్సమన్ గా మారాడు. చివరి 19 ఓవర్లో ఒక ఫోర్, ఒక సిక్స్ లిఫ్ట్ చేసి విజయం ఇంగ్లాండు వశమవుతుందన్న అనుమానాలు రేకెత్తించాడు. దీనితో ఇండియన్ ఆటగాళ్లకు గుండెల్లో రైళ్లు పరుగెడినంత పనైంది. 
 
గ్యాలరీలో టీమిండియా అభిమానులు ఊపిరి బిగపట్టి ఆటన చూస్తున్నారు. 6 బంతుల్లో 8 పరుగులు చాలు. లక్ష్యం ఛేదించదగ్గదే. ఇంకేముంది... అందరూ ఉత్కంఠతతో చూస్తున్న తరుణంలో బుమ్రా మొదటి బంతి వేసాడు. ప్రమాదకర బ్యాట్సమన్ రూట్ అవుటయ్యాడు. రెండవ బంతి బట్లర్ కి, పరుగేమీ రాలేదు. మూడవ బంతి మరో ప్రమాదకర బ్యాట్సమన్ బట్లర్ వికెట్టును గిరాటేసింది. ఇక అంతే... భారత్ విజయం దాదాపు ఖాయమైంది. ఐతే చివరి బంతి వరకూ ఉత్కంఠ సాగింది.

పవన్ మ్యాన్ ఆఫ్ ది మూమెంట్.. కొత్త శక్తి.. లగడపాటి శ్రీధర్

జగన్ వెనుకే జనం వున్నారు, భారీ విజయం సాధిస్తాం: సజ్జల జోస్యం

శ్రీశైలంలో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్, కారణం ఏంటి?

గృహనిర్భంధంలో వైకాపా ఎమ్మెల్యేలు.. పల్నాడులో అప్రమత్తం

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

తర్వాతి కథనం
Show comments