Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా భారత మాజీ స్పిన్నర్

Webdunia
గురువారం, 5 మార్చి 2020 (08:34 IST)
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చీఫ్ సెలెక్టరుగా భారత మాజీ స్పిన్నర్ సునీల్ జోషి ఎంపికయ్యారు. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అలాగే, సెలక్షన్ కమిటీ సభ్యుడిగా మాజీ పేస్ బౌలర్ హర్వీందర్ సింగ్‌ను ఎంపిక చేశారు. 
 
కాగా, సెలక్షన్ కమిటీకి కొత్త ఛైర్మన్ ఎంపిక విషయమై క్రికెట్ అడ్వయిజరీ కమిటీ (సీఏసీ) ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో బుధవారం సమావేశమైంది. ఈ సమావేశానికి సీఏసీ సభ్యులు మదన్ లాల్, రుద్ర ప్రతాప్ సింగ్, సులక్షణా నాయక్‌లు హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా నిర్వహించిన ఇంటర్వ్యూకు సునీల్ జోషి, మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్, ఎల్.ఎస్.శివరామకృష్ణన్, రాజేష్ చౌహాన్, హర్వీందర్ సింగ్ హాజరు కాగా, వీరిలో సునీల్ జోషిని చీఫ్ సెలెక్టరుగా ఎంపిక చేశారు. 
 
సీఏసీ సిఫారసుల మేరకు సునీల్ జోషి, హర్వీందర్ సింగ్ పేర్లను బీసీసీఐ ప్రకటించింది. కాగా, త్వరలో దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ కోసం సునీల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేయనుంది. ఈ పర్యటన కోసం సౌతాఫ్రికా జట్టును ఇప్పటికే ఎంపిక చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

తర్వాతి కథనం
Show comments