Webdunia - Bharat's app for daily news and videos

Install App

అండర్-19 ప్రపంచ కప్ : శ్రీలంకపై గెలుపు.. ఫైనల్లోకి భారత్..!

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (16:33 IST)
అండర్ 19 వరల్డ్ కప్ సెమీఫైనల్ పోటీల్లో భారత బుడ్డోళ్ల జట్టు శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. బంగ్లాదేశ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 267 పరుగులు సాధించింది. 268 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 42.4 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. దీంతో 97 పరుగుల తేడాతో భారత జట్టు గెలుపును నమోదు చేసుకుంది.
 
ఈ మ్యాచ్‌లో ధీటుగా రాణించిన అనుమోల్ ప్రీత్ సింగ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక 11న వెస్టిండీస్- బంగ్లాదేశ్‌ల మధ్య జరిగే రెండో సెమీ ఫైనల్ పోటీ జరుగనుంది. ఈ పోటీలో గెలిచే జట్టుతో 14న జరిగే ఫైనల్ పోరులో భారత్ తలపడనుంది. భారత్ ఆటగాళ్లలో అన్‌మోల్‌ప్రీత్ సింగ్ (72), ఎస్‌ఎన్ ఖాన్ (59)లు అర్థ సెంచరీలు నమోదు చేసుకోగా వాషింగ్టన్ సుందర్ (43) అర్థ సెంచరీకి 7 పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు. 
 
శ్రీలంక బౌలర్లలో ఫెర్నాండో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టగా, కుమార, నిమేష్‌లు చెరో రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. శ్రీలంక బ్యాట్స్‌మెన్లలో మెండిస్ (39), అషాన్ (38), సిల్వ (28), బీఏడీఎస్ సిల్వ (24)లు మెరుగ్గా రాణించారు. భారత బౌలర్లలో దగర్ మూడు వికెట్లు, అవేష్ ఖాన్ రెండు, అహ్మద్, బథమ్, వాషింగ్టన్ సుందర్ తలా ఒక్కో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments