Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంగూలీకి ఛాతినొప్పి.. మళ్లీ ఆస్పత్రిలో అడ్మిట్

Webdunia
బుధవారం, 27 జనవరి 2021 (15:13 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చీఫ్ సౌరవ్ గంగూలీకి మళ్లీ ఛాతినొప్పి వచ్చింది. దీంతో ఆయన మళ్లీ ఆస్పత్రిలో చేరారు. బుధవారం మధ్యాహ్నం గుండె నొప్పితో బాధపడటంతో కుటుంబసభ్యులు కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రికి తరలించారు.
 
కాగా, గంగూలీ ఛాతీలో నొప్పితో బాధపడడం ఇదే తొలిసారి కాదు. ఇటీవలే ఆయనకు వ్యాయామం చేస్తుండగా అస్వస్థతకు గురికావడంతో కోల్‌కతా ఉడ్‌లాండ్స్ ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు ఆయనకు ఏంజియోప్లాస్టీ నిర్వహించారు. 
 
అవసరమైతే మరోసారి ఏంజియోప్లాస్టీ చేయాల్సి ఉంటుందని ఈ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. సర్జరీ అనంతరం గంగూలీ కోలుకోవడంతో అభిమానులు ఎంతో సంతోషించారు. ఆయన మరోసారి ఆసుపత్రిపాలవడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. 
 
సౌరవ్ గంగూలీ గుండెకు ఏమైందన్న ఆందోళనలో ఫ్యాన్స్ ఉన్నారు. మొన్నటికి మొన్న యాంజియోప్లాస్టీ చేయగా, ఇంతలోనే గుండె నొప్పి ఏంటని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

తర్వాతి కథనం
Show comments