విండీస్ టూర్కు టీమిండియాను బీసీసీఐ ఎంపిక చేసింది. దేశవాళీ టోర్నీల్లో పరుగుల వరద పారిస్తున్న యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్కు మరోసారి మొండి చెయ్యే చూపించడంపై ఫ్యాన్స్, క్రికెటర్లు మండిపడుతున్నారు. అతను చేసిన పాపం ఏంటో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.
కొంతకాలంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సెంచరీల మీద సెంచరీలు కొడుతున్న సర్ఫరాజ్ ఖాన్కు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు 37 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన సర్ఫరాజ్.. 79 సగటుతో 3,505 పరుగులు చేశాడు. ఇందులో ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది.
వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్కు ఎంపికైన రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ గణాంకాలతో పోలిస్తే సర్ఫరాజ్ ఖాన్దే పైచేయి. అయితే సర్ఫరాజ్ను పక్కనబెట్టేశారు.