Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా బాధితులకు సచిన్ అండ.. మిషన్ ఆక్సిజన్‌కు కోటి రూపాయలు

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (11:40 IST)
కరోనా బాధితులకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అండగా నిలిచారు. కరోనా బాధితులకు సాయంగా మిషన్‌ ఆక్సిజన్‌ సంస్థకు టీం ఇండియా మాజీ క్రికెటర్‌ సచిన్‌ కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఆక్సిజన్‌ కొరతతో బాధపడుతున్న రోగులకు సాయాన్ని అందించేందుకుగాను మిషన్‌ ఆక్సిజన్‌ అనే సంస్థకు తన వంతుగా కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని సచిన్‌ అందజేశారు.
 
ఈ విషయాన్ని స్వయంగా సచిన్‌ ట్విట్టర్‌లో వెల్లడించారు. 250 మందికి పైగా యువకులతో మిషన్‌ ఆక్సిజన్‌ సంస్థ వైరస్‌ బాధితులకు ఆక్సిజన్‌ అందించేందుకు పనిచేస్తోంది. 
 
దేశంలో మొదటిసారి కరోనా విపత్తు సంభవించినప్పుడు ప్రధానమంత్రి సహాయనిధికి రూ.50 లక్షలు విరాళాన్ని అందజేసిన సచిన్‌.. ప్రస్తుతం మరోసారి తన గొప్ప మనసు చాటుకోవడంతో సచిన్‌ అభిమానులంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మిగతా క్రికెటర్లు కూడా దేశం కోసం సాయం చేయాలంటూ.. మరికొందరు కామెంట్స్‌ ద్వారా కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sonia Gandhi: ఉదర రుగ్మతతో ఆస్పత్రిలో సోనియా గాంధీ: నిలకడగానే ఆరోగ్యం

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ పోటీలు : ఏసీబీ విచారణకు కేటీఆర్

ఇజ్రాయెల్ - ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు - విద్యార్థులకు భారత్ అలెర్ట్!!

రీల్స్ కోసం స్టంట్స్.. ట్రాక్టర్‌పై పడుకుని డ్రైవింగ్ చేశాడు... (వీడియో వైరల్)

లోకేశ్ భవిష్యత్‌ను నాశనం చేస్తున్న చంద్రబాబు : అసదుద్దీన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

Prabhas: నిర్మాత వదిలేసినా, ఇండస్ట్రీ వద్దన్నా మారుతీ తో ప్రభాస్ రాజాసాబ్ ఎందుకు చేశాడు

Rashmika: మా కెమిస్ట్రీ చూశాక మరిన్ని అవకాశాలు వస్తాయి : రష్మిక మందన్నా

తర్వాతి కథనం
Show comments