సరిగా ఆడలేకపోతున్నానని భావించినపుడు వైదొలుగుతా : రోహిత్ శర్మ

ఠాగూర్
ఆదివారం, 10 మార్చి 2024 (13:27 IST)
క్రికెట్‍ మైదానంలో‌నా శక్తి మేరకు రాణించలేకపోతున్నానని భావించినపుడు జట్టు నుంచే కాదు.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతానని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. రోహిత్ శర్మ క్రికెట్ శకం ముగిసిందని ఇటీవల ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జెఫ్రీ బాయ్‌కాట్ చేసిన వ్యాఖ్యలను రోహిత్ శర్మ వద్ద ప్రస్తావించగా ఆయన స్పందించారు. తన ఆట బాగాలేదని అనిపించిన రోజున వెంటనే ఆట నుంచి తప్పుకుంటానని చెప్పారు. తనలో ఆట ఇంకా మిగిలి ఉందని స్పష్టం చేశాడు.
 
'నేను సరిగ్గా ఆడటం లేదని భావించినప్పుడు ఈ విషయాన్ని టీమ్ మేనేజ్‌మెంట్‌కు చెప్పి రిటైర్ అవుతా. కానీ నిజాయతీగా చెప్పాలంటే గత రెండు, మూడు ఏళ్లుగా నా ఆట మరింత మెరుగైంది. అత్యుత్తమ ఆట తీరును కనబరుస్తున్నా. నేను గణాంకాలు, రికార్డుల గురించి పెద్దగా పట్టించుకునే వ్యక్తిని కాదు. భారీ స్కోరులు చేయడం ముఖ్యమేకానీ జట్టు అవసరాలకు తగ్గట్టు ఆడటంపై దృష్టిపెట్టాను. నేను జట్టులో కొంత మార్పు తీసుకురావాలనుకున్నాను. ఆటగాళ్లు చాలా స్వేచ్ఛగా ఆడటం మీరు చూస్తున్నారు. వ్యక్తిగత స్కోర్లు ముఖ్యం కాదు. నిర్భయంగా, మనసును ప్రశాంతంగా ఉంచుకుని ఆడితే పరుగులు వాటంతట అవే వస్తాయి' అని రోహిత్ శర్మ చెప్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళలపై ట్రాక్టర్ ఎక్కించి.. ఆపై గొడ్డలితో దాడి..

పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం, మాయమాటలు చెప్పి గోదారి గట్టుకి తీసుకెళ్లి...

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

తర్వాతి కథనం
Show comments