Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌతాఫ్రికా పర్యటన నుంచి రోహిత్ శర్మ ఔట్

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (19:55 IST)
భారత క్రికెట్ జట్టు త్వరలోనే సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనకు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జట్టులో హిట్ మ్యాన్‌గా గుర్తింపు పొందిన రోహిత్ శర్మ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. 
 
ముంబైలో నెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రోహిత్ శర్మ తొడ కండరాల గాయానికి గురయ్యాడు. ఈ కారణంగా ఈ టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. రోహిత్ స్థానాన్ని గుజరాత్ ఆటగాడు ప్రియాంక్ పాంచల్‌తో భర్తీ చేస్తున్నామని అందులో పేర్కొంది.
 
కాగా, ఈ నెల 26వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు భారత క్రికెట్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో మూడు టెస్టులు ఆడాల్సివుంది. ఈ టెస్ట్ సిరీస్ కోసం టీమిండియాకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మలను బీసీసీఐ ఎంపిక చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

బీహార్‌లో ఘోర పరాజయం.. రాజకీయాలకు బైబై చెప్పనున్న ప్రశాంత్ కిషోర్?

మావోయిస్టుల మాట విని యువత చెడిపోవద్దు : బండి సంజయ్ హితవు

విజయవాడ నడిబొడ్డున మావోయిస్టులు - 31 మంది నక్సలైట్లు అరెస్టు

Bengaluru Scam: రూ.32కోట్ల స్కామ్.. ఆమెకు అంత సంపాదన ఎలా వచ్చింది? నెటిజన్ల ప్రశ్న

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యాలకు, వారణాసి టైటిల్ పై రాజమౌళి కు చెక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

తర్వాతి కథనం
Show comments