Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెల్‌బోర్న్ టెస్టుకు ముందు భారత్‌కు ఎదురుదెబ్బ..?

ఠాగూర్
సోమవారం, 23 డిశెంబరు 2024 (17:24 IST)
బోర్డర్ - గవాస్కర్ టెస్ట్ క్రికెట్ సిరీస్‌లో భాగంగా భారత్ ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య క్రికెట్ సిరీస్ జరుగుతుంది. ఇప్పటివరకు మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జరిగింది. ఇందులో తొలి టెస్టులో భారత్ గెలుపొందగా, మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. రెండో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. 
 
ఈ మ్యాచ్‌కు మరో మూడు రోజుల మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియాను ఆందోళనకు గురిచేసే పరిణామం చోటుచేసుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. నెట్ సెషన్‌లో అతడి మోకాలికి దెబ్బ తగిలింది. నొప్పితోనే ప్రాక్టీస్‌ను కొనసాగించినప్పటికీ చివరికి వైద్యుల సాయం పొందాల్సి వచ్చింది.
 
రోహిత్ మోకాలికి ఫిజియోలు పట్టీ వేశారు. దీంతో ప్రాక్టీస్ సెషన్‌లో రోహిత్ నొప్పితో కుర్చీలో కూర్చొ కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గాయం అంత తీవ్రమైనది కాకపోయినప్పటికీ నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు ఫిజియోలు అతడి పరిస్థితిని పరిశీలించే అవకాశం ఉందని కథనాలు పేర్కొంటున్నాయి.
 
మరో కీలక బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు ఇప్పటికే గాయమైన విషయం తెలిసిందే. నాలుగో టెస్ట్ మ్యాచ్ అతడు ఆడడం సందేహమేనంటూ కథనాలు వెలువడుతున్నాయి. తాజాగా రోహిత్ శర్మ కూడా గాయపడడంతో నాలుగో మ్యాచ్‌కు భారత్‌కు గాయాల బెడద తప్పేలా కనిపించడం లేదు.
 
కాగా, భారత జట్టు ఆటగాళ్లందరూ నెట్స్ సెషన్‌లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా పేసర్లు జప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ సుదీర్ఘ సమయం నెట్స్‌లో గడిపారు. విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ కూడా ప్రాక్టీస్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Lion : సింహంతో ఆటలా? ఆ వ్యక్తికి పంజా దెబ్బ తప్పలేదు

తెలుగు చిత్రపరిశ్రమకు కనీస కృతజ్ఞత లేదు - రిటర్న్ గిఫ్ట్‌ను స్వీకరిస్తున్నాం : డిప్యూటీ సీఎం ఆఫీస్

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

తర్వాతి కథనం
Show comments