Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాంబోర్హిని కారులో గంటకు 200 కిమీ వేగంతో దూసుకెళ్లిన రోహిత్.. పసిగట్టిన స్పీడ్ గన్‌లు

Webdunia
గురువారం, 19 అక్టోబరు 2023 (10:20 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు పోలీసులు చలాన్లు వేశారు. గంటకు 200 కిలోమీటర్లకుపైగా వేగంతో దూసుకెళ్లడంతో పోలీసులు ఈ చలాన్లు విధించారు. ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, గురువారం భారత్ - బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరుగనుంది. ఈ మ్యాచ్‌కు పూణె వేదికకానుంది. 
 
ఈ నేపథ్యంలో జట్టు సభ్యులతో కలిసేందుకు రోహిత్ శర్మ ముంబై నుంచి తన లాంబోర్హిని కారులో పూణే బయల్దేరాడు. అయితే హైవేపై రోహిత్ శర్మ గంటకు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో వెళ్లినట్టు స్పీడ్ గన్‌లు గుర్తించాయి. ఓ దశలో రోహిత్ శర్మ కారు గంటకు 215 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నట్టు 'పూణే మిర్రర్' మీడియా కథనం పేర్కొంది. 
 
ఈ నేపథ్యంలో, ట్రాఫిక్ పోలీసులు రోహిత్ శర్మకు మూడు చలాన్లు వేశారని కూడా సదరు మీడియా సంస్థ వెల్లడించింది. రోహిత్ శర్మ డ్రైవింగ్‌పై ట్రాఫిక్ విభాగం స్పందించింది. ఇలా హై స్పీడ్‌లో వెళ్లేకంటే, టీమ్ బస్‌లో పోలీస్ ఎస్కార్ట్‌తో వెళ్లి ఉంటే బాగుండేదని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

గురుకుల పాఠశాల మరుగుదొడ్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు (Video)

ఎనిమిదో అంతస్తు నుంచి దూకి ఐటీ శాఖ ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

తర్వాతి కథనం
Show comments