Webdunia - Bharat's app for daily news and videos

Install App

అండర్‌-19 ప్రపంచకప్‌: నేపాల్‌పై భారత్‌ ఘనవిజయం

Webdunia
సోమవారం, 1 ఫిబ్రవరి 2016 (16:20 IST)
అండర్‌-19 ప్రపంచకప్‌లో యువభారత్‌ హవా కొనసాగుతోంది. ఈ టోర్నీలో ఇప్పటికే క్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన భారత్‌... నామమాత్రమైన మూడో వన్డేలోనూ ఆతిథ్య జట్టు నేపాల్‌పై ఘనవిజయం సాధించింది. పొగమంచు కారణంగా ఆలస్యం కావడంతో మ్యాచ్‌ను 48 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన నేపాల్‌ నిర్ణీత 48 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 169 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అవేష్‌ ఖాన్‌ 3, మయాంక్‌ డాగర్‌ 2, వాషింగ్టన్‌ సుందర్‌ 2 వికెట్లు తీశారు. 
 
అనంతరం 170 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 18.1 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. ఓపెనర్లు రిషబ్‌ పంత్ ‌(72), ఇషాన్‌ కిషన్ ‌(52) నేపాల్‌ బౌలర్లపై ఎదురుదాడి చేయడంతో భారత్‌ విజయం ఖాయమైంది. వీరిద్దరూ తొలివికెట్‌కు 124 పరుగులు జోడించారు. అనంతరం స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయిన జట్టును సర్ఫరాజ్‌ ఖాన్‌ (21 నాటౌట్‌), అర్మాన్‌ జాఫర్ ‌(12 నాటౌట్‌) విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో గ్రూప్‌-డిలో భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఈ గ్రూప్‌లో రెండు విజయాలు సాధించిన నేపాల్‌ కూడా క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments