Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియాతో భారత్ క్రికెట్ సిరీస్ : ఉచితంగా లైవ్ టెలికాస్ట్...

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (20:03 IST)
భారత్ ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య క్రికెట్ సిరీస్ ప్రారంభంకానుంది. స్వదేశంలో జరిగే ఈ పోటీలను జియో సినియా ఉచితంగా లైవ్ టెలికాస్ట్ చేయనుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ తెలిపింది. ఇప్పటికే ఈ ఏడాది ఐపీఎల్‌ను ఉచితంగా స్ట్రీమింగ్ చేసిన జియో సినిమా ఈ మేరకు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. 
 
ఈ క్రికెట్ సిరీస్‌లో భాగంగా, ఈ నెల 22, 24, 27వ తేదీల్లో భారత్, ఆసీస్ మధ్య మూడు వన్డేలు జరుగుతాయి. వన్డే ప్రపంచకప్‌కు ముందు ఈ సిరీస్ ఇరు జట్లకు సన్నాహకంగా, కీలకంగా మారనుంది. మరోవైపు 2023 సెప్టెంబర్ నుంచి 2028 మార్చి వరకు భారత్‌లో జరిగే అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ టోర్నీల ప్రసార హక్కులను జియో కంపెనీకి చెందిన వయాకామ్ 18 సొంతం చేసుకుంది.
 
అయితే, భారత్ - ఆస్ట్రేలియా సిరీస్ ప్రసారంతో ఐదేళ్ల కాలానికి ఈ హక్కులు మొదలవుతాయి. దాంతో, ఐపీఎల్ తరహాలో ఈ సిరీస్‌ను అందరికీ ఉచితంగా ప్రసారం చేయాలని జియో నిర్ణయించింది. మొత్తం 11 భాషల్లో ఈ మ్యాచ్‌ను వీక్షించే అవకాశం కల్పించనుంది. హిందీ, తెలుగు, తమిళం, ఇంగ్లీష్, కన్నడ, మలయాళం, గుజరాతీ, భోజ్‌పురి, మరాఠీ, బెంగాలీ, పంజాబీ భాషల్లో ప్రసారం చేయనుంది. 

సంబంధిత వార్తలు

అధికారంలోకి వచ్చిన కూటమి.. తామే గెలిచామన్న సంతోషంలో ప్రజలు : నారా భువనేశ్వరి

పవన్ కోసం పరుగులు తీసిన యువతి.. కాన్వాయ్‌తో పోటీ పడి రన్ (video)

ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. 24న జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా?

వ్యవస్థను మోసం చేసిన వ్యక్తి డాక్టర్ అయితే సమాజానికి మరింత హాని : సుప్రీంకోర్టు

తీహార్ జైలులో కవితను కలిసిన బీఆర్ఎస్ నేతలు

ప్రియదర్శి, నభా నటేష్ ల డార్లింగ్ నుంచి ఖలసే సాంగ్ రిలీజ్

పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో అశ్విన్ బాబు శివం భజే చిత్రం

దర్శకుడు తేజ ఆవిష్కరించిన పోలీస్ వారి హెచ్చరిక టైటిల్ లోగో

ఆ గాయంతోనే నింద షూటింగ్ చేశాను : హీరో వరుణ్ సందేశ్

సీతా కళ్యాణ వైభోగమే ట్రైలర్, పాటలు బాగున్నాయన్న సీఎం రేవంత్ రెడ్డి

తర్వాతి కథనం
Show comments