Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియాతో భారత్ క్రికెట్ సిరీస్ : ఉచితంగా లైవ్ టెలికాస్ట్...

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (20:03 IST)
భారత్ ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య క్రికెట్ సిరీస్ ప్రారంభంకానుంది. స్వదేశంలో జరిగే ఈ పోటీలను జియో సినియా ఉచితంగా లైవ్ టెలికాస్ట్ చేయనుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ తెలిపింది. ఇప్పటికే ఈ ఏడాది ఐపీఎల్‌ను ఉచితంగా స్ట్రీమింగ్ చేసిన జియో సినిమా ఈ మేరకు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. 
 
ఈ క్రికెట్ సిరీస్‌లో భాగంగా, ఈ నెల 22, 24, 27వ తేదీల్లో భారత్, ఆసీస్ మధ్య మూడు వన్డేలు జరుగుతాయి. వన్డే ప్రపంచకప్‌కు ముందు ఈ సిరీస్ ఇరు జట్లకు సన్నాహకంగా, కీలకంగా మారనుంది. మరోవైపు 2023 సెప్టెంబర్ నుంచి 2028 మార్చి వరకు భారత్‌లో జరిగే అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ టోర్నీల ప్రసార హక్కులను జియో కంపెనీకి చెందిన వయాకామ్ 18 సొంతం చేసుకుంది.
 
అయితే, భారత్ - ఆస్ట్రేలియా సిరీస్ ప్రసారంతో ఐదేళ్ల కాలానికి ఈ హక్కులు మొదలవుతాయి. దాంతో, ఐపీఎల్ తరహాలో ఈ సిరీస్‌ను అందరికీ ఉచితంగా ప్రసారం చేయాలని జియో నిర్ణయించింది. మొత్తం 11 భాషల్లో ఈ మ్యాచ్‌ను వీక్షించే అవకాశం కల్పించనుంది. హిందీ, తెలుగు, తమిళం, ఇంగ్లీష్, కన్నడ, మలయాళం, గుజరాతీ, భోజ్‌పురి, మరాఠీ, బెంగాలీ, పంజాబీ భాషల్లో ప్రసారం చేయనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సోనియా గాంధీకి ఏమైంది... వైద్యుల పర్యవేక్షణలో చికిత్స!!

మోడల్ గొంతు కోసి హత్య.. మృతదేహాన్ని కాలువలో పడేశారు..

పెట్రోల్ బంకు సిబ్బంది ఛాతిపై తుపాకీ గురిపెట్టిన యువతి .. తర్వాత ఏమైంది (Video)

Rapido: ఎందుకలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నావ్..? ర్యాపిడో డ్రైవర్‌ను నిలదీసిన యువతికి చెంపదెబ్బ (video)

Sonia Gandhi: ఉదర రుగ్మతతో ఆస్పత్రిలో సోనియా గాంధీ: నిలకడగానే ఆరోగ్యం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

తర్వాతి కథనం
Show comments