Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంచీ రాంబో.. ధోనీ రూ.43లక్షల కారులో.. కివీస్ ఆటగాళ్లు బస్సులో.. ఫోటో వైరల్..

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి కార్లు, బైకులంటే పిచ్చి. అతని వద్ద ఇప్పటికే 23 బైకులు, పదికి పైగా కార్లున్నాయి. ఈ నేపథ్యంలో ధోనీని చూసి కివీస్ క్రికెటర్లు టామ్ లాథమ్, రాస్ టేలర్ షాక్ అయ్యారు.

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2016 (13:18 IST)
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి కార్లు, బైకులంటే పిచ్చి. అతని వద్ద  ఇప్పటికే 23 బైకులు, పదికి పైగా కార్లున్నాయి. ఈ నేపథ్యంలో ధోనీని చూసి కివీస్ క్రికెటర్లు టామ్ లాథమ్, రాస్ టేలర్ షాక్ అయ్యారు. ఎక్కడంటే.. ధోనీ స్వస్థలమైన రాంచీలో. రాంచీలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌లో భారత్- న్యూజిలాండ్ మధ్య నాలుగో వన్డే మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు ఇప్పటికే స్టేడియానికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ధోనీ తన హమ్మర్ కారులో వెళ్తుండగా, అదే సమయంలో న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ బస్సులో వెళ్తోంది.
 
ఆ బస్సు పక్కనుంచే ధోనీ వాహనం వెళుతుండటం, లాథమ్, టేలర్లు అది గమనించడం జరిగింది. దీంతో, సంతోషంతో పాటు వారు ఒకింత ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కాగా ధోనీ కనిపించిన కారును రూ. 1.5లక్షలు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. దీని విలువ రూ.43లక్షలు.  కాగా.. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో భారత్ రెండు, కివీస్ ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించాయి.

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

తర్వాతి కథనం
Show comments