సెమీ ఫైనల్ మ్యాచ్ : వాంఖేడ్ స్టేడియంలో అతిరథ మహారథులు

Webdunia
బుధవారం, 15 నవంబరు 2023 (16:56 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు స్టేడియంకు తరలివచ్చారు. 
 
ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించే అతిథుల జాబితాలో అనేక మంది ఉన్నారు. వీవీఐపీ లాంజ్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, రణబీర్ కపూర్, ఇంగ్లండ్ మాజీ క్రికెట్ దిగ్గజం డేవిడ్ బెక్ హామ్, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ తదితరులు కనిపించనున్నారు.
 
అలాగే, మ్యాచ్‌ను చూసేందుకు సూపర్ స్టార్ రజినీకాంత్ మంగళవారం రాత్రే చెన్నై నుంచి ముంబై చేరుకున్నారు. ముంబైకి బయల్దేరే ముందు చెన్నైలో రజినీకాంత్ మాట్లాడుతూ, మ్యాచ్ చూసేందుకు ముంబై వెళ్తున్నానని చెప్పారు. 
 
మరోవైపు బెక్ హామ్ యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్‌గా ఉన్నారు. మహిళలు, బాలకల సాధికారత, లింగ సమానత్వం కోసం యూనిసెఫ్, ఐసీసీ కలిసి పని చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు బెక్ హామ్ గెస్టుగా వచ్చారు. సచిన్ టెండూల్కర్‌తో కలిసి స్టేడియంలో బెక్ హామ్ సందడి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Drones: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మందుల సరఫరాకు రంగంలోకి డ్రోన్‌లు

పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్ - అమ్మకానికి పెట్టిన పాక్ పాలకులు

పైరసీ చేసినందుకు చింతిస్తున్నా, వైజాగ్‌లో రెస్టారెంట్ పెడ్తా: ఐబొమ్మ రవి

ఉప్పాడ సముద్ర తీరం వెంబడి కాలుష్యానికి చెక్.. పవన్ పక్కా ప్లాన్

తనకంటే అందంగా ఉన్నారని అసూయ.. ముగ్గురు బాలికలను చంపేసిన కిరాతక లేడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

Allu Arjun : కున్రిన్ పేరుతో జపనీస్ థియేటర్లలోకి అల్లు అర్జున్... పుష్ప 2

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

Chiranjeevi: విక్టరీ వెంకటేష్ ఎనర్గి ప్రతి క్షణం ఆనందం కలిగించింది : చిరంజీవి

తర్వాతి కథనం
Show comments