Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూణెలో రాహుల్ - పంత్ విధ్వంసం : ఇంగ్లండ్ టార్గెట్ 337 రన్స్ టార్గెట్

Webdunia
శుక్రవారం, 26 మార్చి 2021 (17:37 IST)
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా, శుక్రవారం పూణె వేదికగా రెండో వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవరల్లో ఆరు వికెట్ల నష్టానికి 336 పరుగుల భారీ స్కోరు చేసింది. 
 
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకోగా, భారత జట్టు బ్యాటింగ్‌కు దిగింది. టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ 25, ధావన్ 4 పరుగులు చేశారు.
 
ఇటీవల టీ20 సిరీస్‌లో దారుణంగా విఫలమై ఓపెనర్ స్థానం నుంచి మిడిలార్డర్‌కు మారిన కేఎల్ రాహుల్ తన క్లాస్ ఆటతీరు చూపిస్తూ సెంచరీ సాధించగా, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ మరోసారి ఇంగ్లండ్ బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. దాంతో భారత్ భారీ స్కోరు చేసింది. 
 
కేఎల్ రాహుల్ 114 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులతో 108 పరుగులు చేయగా, పంత్ కేవలం 40 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో 77 పరుగులు సాధించాడు. అంతకుముందు కెప్టెన్ కోహ్లీ 66 పరుగులు చేయగా, చివర్లో హార్దిక్ పాండ్య కూడా 4 సిక్సులు, ఒక ఫోర్ బాది 35 పరుగులు సాధించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో టాప్లే, టామ్ కరన్ రెండేసి వికెట్లు తీయగా, శామ్ కరన్, అదిల్ రషీద్ చెరో వికెట్ దక్కించుకున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments