Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ క్రికెటర్లపై బీసీసీఐ సెలక్టర్లు వివక్ష...

Webdunia
శనివారం, 20 ఏప్రియల్ 2019 (17:52 IST)
వచ్చేనెలలో జరుగనున్న ఐసీసీ ప్రపంచ కప్ మెగా ఈవెంట్‌కు 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ సెలెక్టర్లు ప్రకటించారు. ఇందులో హైదరాబాద్‌ క్రికెటర్ అంబటి రాయుడుకు చోటు కల్పించలేదు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగాయి. అయినప్పటికీ బీసీసీఐ సెలెక్టర్లు తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. 
 
అయితే, భారత స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓఝా మాత్రం మండిపడ్డారు. హైదరాబాదీ ఆటగాళ్లకు ప్రతీసారి అన్యాయం జరగడం ఆసక్తి రేపుతుందని.. గతంలో తనకు కూడా ఇలాగే జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికే రాయుడును పక్కన పెట్టడాన్ని పలువురు మాజీలు తప్పుపడుతుంటే.. ఓఝా మాటలు అగ్నికి ఆజ్యం పోసేలా ఉన్నాయి. 
 
మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో అర్థాంతరంగా జట్టుకు దూరమైన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ శుక్రవారం ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఐసీసీ మెగా ఈవెంట్‌కు రాయుడును కాదని త్రీ డైమెన్షన్ ప్లేయర్ తమిళనాడుకు చెందిన విజయ్ శంకర్‌ను ఎంపిక చేయడంపై... అంబటి ట్విట్టర్ వేదికగా రాబోయే మెగాటోర్నీ చూసేందుకు త్రీడీ కళ్లద్దాలు ఆర్డర్ చేస్తున్నాఅని వ్యంగ్యాస్త్రాలు సంధించిన విషయం తెల్సిందే. 
 
దీనికి మద్దతుగా ఓఝా హైదరాబాదీ క్రికెటర్లకే ఇలా జరగడంపై చేసిన ట్వీట్ ఆసక్తి రేపుతోంది. గతంలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నా.. ఆ బాధేంటో నాకు తెలుసని ట్వీట్ చేశాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆడిన చివరి టెస్టులో వెస్టిండీస్‌పై 10 వికెట్లు పడగొట్టి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌'గా నిలిచిన ఓఝా ఆ తర్వాత అనూహ్యంగా జట్టుకు దూరమయ్యాడు. భారత్ తరపున 24 టెస్టులు ఆడిన ప్రజ్ఞాన్ ఓఝా 113 వికెట్లు పడగొట్టాడు. అలాగే, 18 వన్డేలు, ఆరు టీ20 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చైన్ స్నాచింగ్ అలా నేర్చుకున్న వ్యక్తి అరెస్ట్- రూ.20లక్షల విలువైన బంగారం స్వాధీనం

మహిళా కౌన్సిలర్ కాళ్ల మీద పడ్డాడు... నడుముపై అసభ్యంగా చేయి వేశాడే? (video)

Pawan kalyan: సెప్టెంబర్ 5న అరకులో పర్యటించనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్

Amaravati: అమరావతి అత్యంత సురక్షితమైన రాజధాని- మంత్రి నారాయణ

గతుకుల రోడ్డుకి ఎంత ఫైన్ కడతారు?: ద్విచక్ర వాహనదారుడు డిమాండ్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Murugadoss: దాని వల్లే ఐదేళ్ల టైం వృథా అయింది. మన దగ్గర ప్రపంచస్థాయి కంటెంట్ వుంది : ఏఆర్ మురుగదాస్

Sri Vishnu: గతంలో రిలీజ్ కు సురేష్ బాబు, దిల్ రాజు, ఇప్పుడు బన్నీ వాస్ వున్నారు : శ్రీ విష్ణు

Anushka : అందుకే సినిమాలు తగ్గించా.. ప్రస్తుతం మహాభారతం చదువుతున్నా : అనుష్క శెట్టి

కిష్కింధపురి సినిమా చూస్తున్నప్పుడు ఫోన్ చూడాలనిపించదు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

జటాధర లో శిల్పా శిరోద్కర్ అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌ చేసింది : నిర్మాత ప్రేరణ అరోరా

తర్వాతి కథనం
Show comments