Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ క్రికెట్ జట్టులో ప్రక్షాళనకు ఇమ్రాన్ ఖాన్ శ్రీకారం

Webdunia
సోమవారం, 12 ఆగస్టు 2019 (18:21 IST)
ప్రపంచకప్‌లో చెత్త ప్రదర్శన, వరుస ఓటములు, జట్టులో సంక్షోభం నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డును గాడిలో పెట్టేందుకు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రంగంలోకి దిగారు. స్వయంగా క్రికెటర్ కావడం, సుధీర్ఘ అనుభవం రీత్యా క్షేత్ర స్థాయిలో చర్యలకు ప్రధాని శ్రీకారం చుట్టారు.
 
మొన్నటి వరకు కోచ్‌గా వ్యవహరించిన మికీ ఆర్ధర్‌ను తప్పించడం వెనుక ఇమ్రాన్ హస్తం ఉన్నట్లుగా తెలుస్తోంది. జట్టు పరిస్థితి దృష్ట్యా మరో రెండేళ్ల పాటు ఆర్థర్‌ను కోచ్‌గా కొనసాగించాలని పీసీబీ పెద్దలు భావించినప్పటికీ ఇమ్రాన్ జోక్యం చేసుకుని ఆర్ధర్‌ను తప్పించాలని సూచించినట్లుగా తెలుస్తోంది.
 
దీంతో పాటు జట్టు మేనేజ్‌మెంట్‌లో మార్పులు చేయడానికి కూడా ఇమ్రాన్ ఖాన్ పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది. జట్టు కోచ్‌గా విదేశీ కోచ్ కంటే స్వదేశానికి చెందిన వ్యక్తినే కోచ్‌గా ఎంపిక చేయాలని పీసీబీ భావిస్తోంది. 
 
విదేశాలకు చెందిన మికీ ఆర్ధర్ మార్గదర్శకత్వంలో పాకిస్తాన్ జట్టు మెరుగైన ఫలితాలు సాధించకపోవడంతో పాక్‌కు చెందిన వ్యక్తే కోచ్‌గా వస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని మెజార్టీ పెద్దలు వ్యక్తం చేసినట్లుగా టాక్. ఇక కొత్త కోచ్ రేసులో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు మొహిసిన్ ఖాన్, మిస్బావుల్ హక్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేమే బాస్‌ అనుకునేవారికి భారత్ వృద్ధి నచ్చలేదు : రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పాం : ఎయిర్ చీఫ్ మార్షల్

అపరిశుభ్రమైన - అసౌకర్యమైన సీటు కేటాయింపు - ఇండిగో సంస్థకు అపరాధం

ఆడుదాం ఆంధ్రా స్కామ్‌పై విచారణ పూర్తి : తొలి అరెస్టు మాజీ మంత్రి రోజానేనా?

పిఠాపురంలో వితంతువులకు చీరలు పంచిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

తర్వాతి కథనం
Show comments