Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ పిచ్‌కు పూజలు చేసిన ఎమ్మెస్కే.. నెట్టింట వీడియో వైరల్

Webdunia
శుక్రవారం, 26 అక్టోబరు 2018 (15:16 IST)
భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య రెండో వన్డేకు విశాఖ ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా విశాఖలో జరిగిన వన్డే పిచ్‌పై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ పూజలు నిర్వహించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో కలకలం రేపుతున్నాయి. ప్రధాన పిచ్‌లో మూడు వికెట్లు పెట్టి పూజారితో ప్రత్యేక పూజలు నిర్వహించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. 
 
ఎమ్మెస్కేతో పాటు స్టేడియం ఉద్యోగులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐసీసీ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగే పిచ్‌పైకి ఇతరులు ప్రవేశించడం నిషేధం. అలాంటిది.. ప్రత్యేక పూజలు చేయించడం.. ఆ కార్యక్రమంలో ఇతరులు పాల్గొనడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మ్యాచ్‌కు ముందు వీటిని పరిశీలించే అవకాశం కెప్టెన్లకు వున్నా.. కఠినమైన నిబంధనలు వుంటాయి. అలాంటిది పిచ్‌పైకి ఏకంగా పూజారిని తీసుకెళ్లి పూజలు నిర్వహించడం కలకలం రేపుతుంది.
 
అయితే సదరు వీడియోలో స్టేడియంలో సీట్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఈ పూజలు ఎప్పుడు జరిగాయనే దానిపై ప్రస్తుతం చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో దీనిపై విమర్శలు వస్తుండటంతో బీసీసీఐ ఎమ్మెస్కే ప్రసాద్‌ను వివరణ కోరే అవకాశం ఉంది. మరోవైపు ఉత్కంఠభరితంగా సాగినన మ్యాచ్ టై గా ముగిసిన సంగతి విదితమే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

MBBS Student: వియత్నాంలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థి మృతి

తెలంగాణ: రూ.5.21 లక్షల అబార్షన్ కిట్లు, మందులు కూడా స్వాధీనం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

తర్వాతి కథనం
Show comments