Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా జట్టుకు ఉగ్రముప్పు.. పీసీబీకి మెయిల్.. భద్రత కట్టుదిట్టం

Webdunia
సోమవారం, 19 ఆగస్టు 2019 (13:05 IST)
టీమిండియా జట్టుకు ఉగ్రముప్పు పొంచివుందని హెచ్చరికలు రావడంతో ఐసీసీ అప్రమత్తమైంది. టీమిండియాకు ఉగ్ర ముప్పు పొంచి వుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు అనామక మెయిల్ నుంచి సమాచారం అందింది. 
 
విండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా జట్టుపై దాడులు జరపబోతున్నామని అందులో పేర్కొన్నారు. పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వెంటనే ఆ మెయిల్‌ను ఐసీసీకి పంపించింది. ఇటు బీసీసీఐకి కూడా అలాంటి మెయిలే రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 
 
బీసీసీఐ భారత హోంమంత్రిత్వ శాఖకు సమాచారం అందించడంతో.. అంటిగ్వాలోని భారత హైకమిషన్‌ను అలర్ట్ చేశారు. దీంతో ఆటగాళ్లకు భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. ఆటగాళ్ల భద్రత విషయంలో ఎటువంటి ఆందోళన అవసరం లేదని అంటిగ్వాలోని భారత హైకమిషన్ అధికారి తెలిపారు. 
 
అక్కడ భారత ఆటగాళ్లు బస చేస్తున్న హోటల్, దాని పరిసరాలపై పటిష్టమైన నిఘా ఉందన్నారు. కాగా, ఉగ్రదాడుల బెదిరింపు హెచ్చరికలతో వచ్చిన మెయిల్ బోగస్ అని అధికారులు తేల్చినట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాఫీ బాగోలేదన్నందుకు హత్య చేసారా? కొత్తజంట హనీమూన్ మిస్సింగ్ మిస్టరీ

రౌడీ షీటర్లను పరామర్శించేందుకు వెళ్లిన జగన్... ప్రజా సంఘాల నిరసన

కెనరా బ్యాంకులో దొంగలుపడ్డారు... 59 కేజీల బంగారం మాయం

Kukatpally: కూకట్‌పల్లిలో రూ.2కోట్ల డ్రగ్స్‌తో ముఠా అరెస్ట్

ఆగివున్న ట్యాంకర్‌ను ఢీకొన్న కారు : ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్రాలపై నయనతారకు ఎందుకో అంత ఇష్టం??

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

తర్వాతి కథనం
Show comments