Webdunia - Bharat's app for daily news and videos

Install App

పారాలింపిక్స్ క్రీడలు : భారత్ ఖాతాలో మరో పతకం .. మొత్తం 25

ఠాగూర్
శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (16:06 IST)
పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ పోటీల్లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింద. భారత జూడో ఆటగాడు కపిల్ పార్మర్‌ పతకం కైవసం చేసుకున్నాడు. దీంతో భారత్ పతకాల సంఖ్య 25కు చేరింది. గురువారం జరిగిన పురుషుల 60 కిలోల జే1 ఈవెంట్లో కాంస్యం గెలిచారు. ప్రపంచ రెండో ర్యాంకర్ జూడోకా ఎలియెల్టన్ డి ఒలివెరాను ఓడించి పతకం సొంతం చేసుకున్నారు. దీంతో కపిల్ పార్మర్ జూడోలో మెడల్ సాధించిన మొదటి భారత జూడోకాగా చరిత్ర సృష్టించారు.
 
మరోవైపు మిశ్రమ రికర్వ్ ఓపెన్ ఈవెంట్లో ఆర్చర్లు హర్విందర్ సింగ్, పూజ తమ కాంస్య పతక పోరులో పరాజయం పాలయ్యారు. అంతకుముందు వ్యక్తిగత విభాగంలో హర్విందర్ సింగ్ గోల్డ్ గెలిచిన విషయం తెలిసిందే. ఇక పవర్ లిఫ్టర్ అశోక్, షాట్ పుటర్ అరవింద్ ఆకట్టుకోలేకపోయారు. సిమ్రాన్ శర్మ కూడా మహిళల 100 మీటర్ల టీ12 ఫైనల్లో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకాన్ని కోల్పోయింది.
 
ఇక టీమిండియా ఈసారి 25 పతకాల లక్ష్యంగా బరిలోకి దిగగా, గురువారంతో ఆ ఆ లక్ష్యాన్ని చేరుకుంది. మరో మూడు రోజులు ఆటలు మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ పతకాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని. ప్రస్తుతం భారత్ ఖాతాలో 25 మెడల్స్ ఉండగా.. వీటిలో 5 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్య పతకాలు ఉన్నాయి. దీంతో పతకాల పట్టికలో భారత్ 16వ స్థానంలో కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

దేశంలో జమిలి ఎన్నికలు తథ్యం.. అమలుకు ప్రత్యేక కమిటీ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ముంబై నటినే కాదు.. ఆమె సోదరుడిని కూడా వేధించిన పీఎస్ఆర్ ఆంజనేయులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

తర్వాతి కథనం
Show comments