Webdunia - Bharat's app for daily news and videos

Install App

తడాఖా చూపెట్టిన లంకేయులు.. అదరగొట్టిన దాయాదులు.. గెలుపు ఎవరిది?

Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2023 (22:38 IST)
Pakistan vs Sri Lanka
హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం వేదికగా పాకిస్థాన్, శ్రీలంక జట్లు వరల్డ్ కప్ మ్యాచ్ ఆడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక భారీ స్కోరు సాధించింది. శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 344 పరుగులు సాధించింది. 
 
లంకేయుల్లో కుశాల్ మెండిస్, వికెట్ కీపర్ సమరవిక్రమ సూపర్ సెంచరీలతో అదరగొట్టారు. పాక్ ఆటగాళ్లు తేలిపోవడంతో శ్రీలంక భారీ స్కోర్ సాధించింది. వీరిలో కుశాల్ మెండిస్ 77 బంతుల్లోనే 122 పరుగులు సాధించడం విశేషం. 
 
మెండిస్ స్కోరులో 14 ఫోర్లు, 6 సిక్సులు వున్నాయి. కాగా, మెండిస్ శ్రీలంక తరఫున వరల్డ్ కప్‌లో వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు పుటల్లోకి ఎక్కాడు. మరోవైపు సమరవిక్రమ 89 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సులతో 108 పరుగులు చేశాడు. 
 
వీరిద్దరి విజృంభణతో షహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, హసన్ అలీ, షాదాబ్ ఖాన్ లతో  కూడిన పాక్ బౌలింగ్ విభాగం డీలా పడిపోయింది. ఆపై 345 పరుగుల లక్ష్యఛేదనలో పాకిస్థాన్‌కు కష్టాలు తప్పలేదు. కానీ పాక్ బ్యాట్స్‌మెన్లు రాణించడంతో ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక విజయవంతమైన లక్ష్యాన్ని ఇంకా 10 బంతులు మిగిలి ఉండగానే ముగించారు. 
 
రిజ్వాన్ సముచితంగా విజయవంతమైన పరుగులు సాధించాడు. అతను 121 బంతుల్లో 131 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు, ఇఫ్తికార్ 10 బంతుల్లో 22 పరుగులతో అజేయంగా నిలిచాడు. శ్రీలంక తరఫున రెండు సెంచరీలు 344/9కి చేరుకున్నాయి. అదేవిధంగా పాకిస్థాన్‌కు రెండు సెంచరీలు 345/4కి చేరుకున్నాయి. 
 
దీంతో 345 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్ మరో 10 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. అది జట్టుకు భారీ ఆత్మవిశ్వాసాన్ని అందించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

తర్వాతి కథనం
Show comments