Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ అంటే ఆ మాత్రం భయం ఉండాలి కదా.. అందుకే పాక్ జట్టు వణుకుతోందా?

దాయాదుల మధ్య ఇంకా ఆటే మొదలు కాలేదు. అయినా సరే టీమిండియాతో పోటీ అంటే పాకిస్తాన్ జట్టుకు, మాజీ ఆటగాళ్లకు భయం పుట్టుకొచ్చినట్లుంది. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోనీ అనే పేరు వింటే చాలు పాక్ క్రికెటర్లకు, అభిమానులకు చమటలు పడుతున్నాయి. యధావిధిగా ఈసారి కూడా భా

Webdunia
శనివారం, 3 జూన్ 2017 (08:38 IST)
దాయాదుల మధ్య ఇంకా ఆటే మొదలు కాలేదు. అయినా సరే టీమిండియాతో పోటీ అంటే పాకిస్తాన్ జట్టుకు, మాజీ ఆటగాళ్లకు భయం పుట్టుకొచ్చినట్లుంది. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోనీ అనే పేరు వింటే చాలు పాక్ క్రికెటర్లకు, అభిమానులకు చమటలు పడుతున్నాయి.  యధావిధిగా ఈసారి కూడా భారత్‌పై గెలుపు మాదే అంటూ ముందే మైండ్ గేమ్ మొదలెట్టాల్సిన పాకిస్తాన్ జట్టు, దాని అభిమానులు ధోనీ దెబ్బ కాచుకుంటే చాలు..  గండం గడిచినట్లే అంటూ జాగ్రత్తలు చెప్పుకుంటున్నారు. 
 
టీమ్ ఇండియా మొత్తం ఒకెత్తు. ధోనీ ఒకెత్తు చాలా జాగ్రత్త.. మ్యాచ్ గతిని మార్చడంలో ధోనికి సా
టి ఎవరూ లేరంటూ పాక్ జట్టుకు దాని మాజీ క్రికెటర్లు ముందుస్తుగా హెచ్చరికలు చెబుతున్నారంటే ధోనీ పాక్ గుండెల్లో రేపుతున్నభయం ఏ స్థాయిలో ఉందో ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో మైదానంలో ధోనీ పాత్రను అతడు కలిగించే ప్రభావాన్ని ప్రశంసించడంలో కూడా పాక్ మాజీ క్రికెటర్లు వెనక్కు తగ్గడం లేదు. పాక్ నుంచి ఇటీవలి కాలంలో దాయాది దేశానికి చెందిన ఆటగాళ్ల ప్రతిభకు ప్రశంసలు దక్కడం ఇద్దరి విషయంలేనే జరిగింది. వారు కోహ్లీ, ధోనీ.
 
తాజాగా పాకిస్తాన్ మాజీ ఆటగాడు అమీర్ సొహైల్ పాక్ అటగాళ్లను ధోనీ విషయమై తీవ్రంగా హెచ్చరించాడు. చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌తో జరిగే కీలక పోరులో మహేంద్ర సింగ్ ధోనితో జాగ్రత్తగా ఉండాలని అమీర్ సొహైల్ తమ ఆటగాళ్లను హెచ్చరించాడు. అదే సమయంలో మ్యాచ్ గతిని మార్చడంలో ధోనికి సాటి ఎవరూ లేరంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. ధోని విషయంలో పాక్ ఆటగాళ్లు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశాడు.
 
'ధోనికున్న పరిమితమైన వనరులతోనే మ్యాచ్‌లను గెలిపించిన సందర్భాలు అనేకం. అతను ఎప్పటికీ మ్యాచ్ విన్నరే. ధోని విషయంలో పాక్ జాగ్రత్తగా ఉండాలి. ధోని ఒక ప్రమాదకర బ్యాట్స్‌మన్ అనే సంగతి గుర్తుపెట్టుకుని ఆడండి'పాక్ మాజీ ఓపెనర్ సోహైల్ పేర్కొన్నాడు. 
 
ధోనీ బ్యాట్స్‌మన్ గానే కాకుండా వికెట్ కీపర్‌గా కూడా అనేక మ్యాచ్‌లను గెలిపించిన విషయాన్ని సొహైల్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ధోని క్రీజ్‌లో  కుదురుకుంటే మ్యాచ్‌ను తమవైపుకు లాగేసుకుంటాడనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. 
 
కాగా చాంపియన్స్ ట్రోఫీలో జూన్ 4వ తేదీన భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరుగనుంది. యధావిధిగా ఈ మ్యాచ్ టికెట్లు హాట్ కేక్స్‌లా అమ్ముడుపోయాయి.
 

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

కరెంట్ షాక్ తగిలి పడిపోయిన బాలుడు, బ్రతికించిన వైద్యురాలు - video

కుట్రాళం వాటర్ ఫాల్స్‌లో కొట్టుకుపోయిన కుర్రాడు, అడె గొయ్యాలా ఇంద పక్క వాడా అంటున్నా - live video

ఏపీలో పోలింగ్ అనంతరం హింస : ఈసీకి నివేదిక సిద్ధం.. కీలక నేతల అరెస్టుకు ఛాన్స్!

బీఆర్ఎస్ పార్టీ వుండదా? వైసిపిని చూడండి: విజయశాంతి భారాసలో చేరుతారా?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

తర్వాతి కథనం
Show comments