Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియాతో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్: 213 పరుగులకే పాక్ ఆలౌట్!

Webdunia
శుక్రవారం, 20 మార్చి 2015 (12:45 IST)
ప్రపంచ కప్ క్రికెట్ పోటీలలో భాగంగా శుక్రవారం అడిలైడ్‌లో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, పాకిస్తాన్ దేశాలు తలపడుతున్నాయి. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ తన ఇన్నింగ్స్‌లో 49.5 ఓవర్లకు 213 పరుగులు చేసి ఆలౌట్ అయింది. పాకిస్థాన్ బ్యాటింగ్ ప్రారంభించిన వెంటనే రెండు వికెట్లను వెంటవెంటనే కోల్పోయింది. 22 పరుగుల స్కోరు దగ్గరకు వచ్చేసరికే రెండు వికెట్లను కోల్పోయింది. 
 
అహ్మద్ హెహజాద్ (5), షర్ఫాజ్ అహ్మద్ (10) పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తర్వాత పాకిస్థాన్ వికెట్లు టపటపా రాలిపోయాయి. బోలెడంత స్కోరు చేయాలని బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ చివరికి 213 స్కోరు వద్ద తన ఇన్నింగ్స్‌ని ముగించింది. 
 
పాకిస్థాన్ ఆటగాళ్లలో మిస్బా ఉల్ హక్ (34), సోహైల్ (41) మినహా ఏ ఒక్కరూ 30 మించలేకపోయారు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో హజ్లేవుడ్ ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టగా, స్టార్క్ 2 వికెట్లు, మాక్స్‌వెల్ 2 వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. జాన్సన్ ఒక వికెట్ మాత్రం సాధించాడు. 

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

Show comments