పాకిస్థాన్ క్రికెటర్లు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్లు తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించారంటూ ఫీల్డింగ్ కోచ్ గ్రాంట్ లుడెన్ ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
ఇటువంటి అవమానకర ప్రవర్తనను తాను సహించబోనని, ఫీల్డింగ్ కోచ్ పదవికి రాజీనామా చేస్తానని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్కు మెసేజ్ పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.
మంగళవారం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు షాహిద్ ఆఫ్రిది, అహ్మద్ షెహజాద్, ఉమర్ అక్మాల్ తనను దూషించారని లుడెన్ ఆరోపించాడు. అయితే లెడెన్ ఫిర్యాదు చేసిన విషయాన్ని పీబీసీ ఇంకా ధ్రువీకరించలేదు. టీమిండియాతో జరిగిన మ్యాచ్కు ముందు టీమ్ కర్ఫ్యూను ఉల్లంఘించినందుకు షాహిద్ ఆఫ్రిది సహా 8 మందికి జట్టు మేనేజ్ మెంట్ జరిమానా విధించిన సంగతి తెలిసిందే.