ఆరేళ్ల తర్వాత పాకిస్తాన్లో జింబాబ్వేతో జరుగుతున్న టి20 మ్యాచ్ కోసం ఎప్పటినుంచో ఎదురుచూసిన అభిమానులు టికెట్ల కోసం ఎగబడ్డారు. కొద్ది వ్యవధిలోనే అన్నీ అమ్ముడుపోయాయి. ఆ తర్వాత బ్లాక్లోనూ కొనేశారు. అయినా కొందరు వీరాభిమానులకు మాత్రం టికెట్లు దక్కలేదు. క్రికెట్ అభిమాన ఆవేశంతో ఉన్న వారు పీసీబీ కార్యాలయంలోకి చొరబడి 1500 రూపాయల విలువ గల 600 టికెట్లు చోరీ చేశారు.
ఈ విషయంపై నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయినప్పటికీ పోతే పోనీలే పెద్ద విలువేం లేదు, అసలు అభిమానులు మ్యాచ్ చూస్తే చాలు, మాకు అదే తృప్తి అంటూ పాక్ బోర్డు అధికారులు సరిపుచ్చారు.