Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించిన పాకిస్థాన్.. విధులకు హాజరుకాని భద్రతా సిబ్బంది!

ఠాగూర్
బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (12:43 IST)
పాకిస్తాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఈ నెల 19వ తేదీ నుంచి సాగుతుంది. ఇప్పటికే ప్రధాన మ్యాచ్‌లు ముగిశాయి. ఈ టోర్నీలో భారత్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా వంటి జట్లు మంచి ప్రదర్శనతో సెమీస్ రేసుకు చేరువయ్యాయి. గ్రూపు ఏ నుంచి భారత్, కివీస్ జట్లు ఇప్పటికే సెమీస్‌కు చేరగా, ఆతిథ్య పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు మాత్రం టోర్నీ నుంచి తప్పుకోనున్నాయి. ఈ రెండు జట్లలో పాకిస్థాన్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించిన జట్టుగా నిలిచింది. దీంతో ఆ జట్టు క్రికెటర్లపై దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు జరిగే స్టేడియాలు, క్రికెటర్లు నివసించే నక్షత్ర హోటళ్లు, వారు ప్రయాణించే రోడ్డు మార్గాల్లో భద్రతకు నియమించిన వారిలో వంది మందికిపైగా భద్రతా సిబ్బంది విధులకు హాజరుకావడం లేదు. 
 
ఈ విషయాన్ని పంజాబ్ ఐజీపీ ఉస్మాన్ అన్వర్ దృష్టికి వెళ్లడంతో సంబంధిత పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారని ఆ అధికారి తెలిపారు. అంతర్జాతీయ కార్యక్రమాల కోసం భద్రత విషయంలో నిర్లక్ష్యానికి అవకాశం ఇవ్వరాదు అని ఐజీపీ పేర్కొన్నట్టు ఐసీసీ అధికారి వెల్లడించారు. కాగా, తొలగించిన పోలీసు సిబ్బంది తమకు కేటాయించిన అధికారిక విధులను నిర్వహించడానికి ఎందుకు నిరాకరించారనే దానిపై అధికారిక సమాచారం లేదు. 
 
అయితే, అక్కడి స్థానిక మీడియా సమాచారం మేరకు సుధీర్ఘమైన పని గంటల కారణంగా ఒత్తిడి గురవుతున్నారని తెలిసింది. అందుకే వారు విధులకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీనికితోడు భారత్, న్యూజిలాండ్ జట్ల చేతిలో తమ జట్టు పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోవడాన్ని కూడా వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ కారణాలతోనే భద్రతా సిబ్బంది విధులకు హాజరుకావడం లేదని తెలుస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో వీహెచ్ భేటీ, హాయిగా టేకు మంచంపై కూర్చుని మాట్లాడుతూ... (video)

Class 10 Student: పదో తరగతి విద్యార్థి.. ఆడ శిశువుకు జన్మనిచ్చింది.. అదీ హాస్టల్‌లో.. ఎలా?

ఎమ్మెల్సీ ఎన్నికలు.. నాగబాబుకు ఎమ్మెల్సీ సీటు.. కూటమికే ఐదు స్థానాలు

ఎయిర్‌పోర్టులో తప్పిన పెనుముప్పు .. విమానం నేలను తాకీతాకగానే మళ్లీ టేకాఫ్ చేసిన పైలెట్!! (Video)

శివరాత్రి వేడుకల్లో అపశృతి - గోదావరిలో స్నానానికి వెళ్లి ఐదుగురు గల్లంతు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానమంటే ఇదికదరా! మార్మోగిపోతున్న గ్లోబల్ స్టార్ ఇమేజ్!

త్రినాథరావు నక్కిన మార్క్ వినోదంగా మజాకా చిత్రం - మజాకా రివ్యూ

నేపాల్‌లో ఒక గ్రామానికి "ప్రభాస్" పేరు.. సోషల్ మీడియాలో ట్రెండింగ్

ఆర్య, గౌతమ్ కార్తీక్ ల మిస్టర్ ఎక్స్ యాక్షన్-ప్యాక్డ్ టీజర్ రిలీజ్

Pooja Hegde: పూజా హెగ్డే సంచలన నిర్ణయం- ఏంటది?

తర్వాతి కథనం
Show comments