Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ రంగంలోనూ మార్పులు : సౌరవ్ గంగూలీ

Webdunia
ఆదివారం, 31 మే 2020 (12:41 IST)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అనేక రంగాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయనీ, అలాగే, క్రికెట్ రంగంలోనూ మార్పులు సంతరించుకుంటాయని బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, అన్ని రంగాల మాదిరిగానే, ఇకపై క్రికెట్ కూడా మారిపోబోనుందని వ్యాఖ్యానించారు. 
 
కరోనాకు వ్యాక్సిన్ లేదా మెడిసిన్ వచ్చేంత వరకూ పరిస్థితి ఇలానే ఉంటుందని, ఆ తర్వాత మాత్రం సాధారణ స్థితి వస్తుందని అభిప్రాయపడ్డారు. అప్పటివరకు క్రికెట్ పోటీల నిర్వహణపై ఆచితూచి అడుగులు వేయాల్సివుంటుందన్నారు. 
 
ఈ మహమ్మారి కారణంగా క్రికెట్ షెడ్యూల్స్‌లో మార్పులుంటాయన్నారు. అదేసమయంలో ఐసీసీతో కలిసి క్రికెట్‌ను సాధారణ స్థితికి తీసుకస్తామన్నారు. క్రికెట్ చాలా శక్తిమంతమైన ఆటని, ఆటగాళ్లకు కూడా కొన్ని పరీక్షలు తప్పవని వ్యాఖ్యానించారు. 
 
భారతీయుల్లో ప్రతిఘటించే శక్తి అధికమని, ప్రస్తుతానికి ఔషధాలు లేకున్నా, అతి త్వరలోనే కరోనాకు వాక్సిన్ వస్తుందన్న నమ్మకం ఉందని గంగూలీ వ్యాఖ్యానించారు. 
 
తన చిన్న వయసులో ఫుట్‌బాల్ గేమే జీవితంగా గడిపానని, అనుకోకుండా క్రికెటర్‌గా మారానని చెప్పిన గంగూలీ, చిన్న వయసులో ఒడిశాపై చేసిన శతకం, లార్డ్స్ మైదానంలో చేసిన సెంచరీ, తనకు మధుర స్మృతులని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ludhiana bypoll: లూథియానా అసెంబ్లీ ఉప ఎన్నిక.. జూన్ 19న పోలింగ్..

గోపాల్‌పూర్ బీచ్‌లో 20 ఏళ్ల మహిళపై పది మంది వ్యక్తుల సామూహిక అత్యాచారం

Raja Raghuvanshi murder case: సోనమ్ రఘువంశీకి మానసిక ఆరోగ్యం బాగానే ఉంది

హనీ ట్రాప్‌లో పోలీసులు.. ఇష్టపడుతున్నానని కౌగిలించుకుంది.. ఆ తర్వాత ఏమైందంటే?

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

తర్వాతి కథనం
Show comments