Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్డే మ్యాచ్‌లపై క్రికెట్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు

Webdunia
శనివారం, 18 మార్చి 2023 (12:11 IST)
భారత క్రికెటర్, లెజెండ్ సచిన్ టెండూల్కర్ వన్డే మ్యాచ్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇపుడు వన్డే మ్యాచ్‌లు బోరు కొట్టేస్తున్నాయంటూ వ్యాఖ్యానించి కలకలం రేపారు. తన వన్డే కెరీర్‌లో 50కిపైగా సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ నోట ఇటువంటి మాటలు రావడంతో ప్రతి ఒక్కరూ విస్తుపోతున్నారు.
 
వన్డే మ్యాచ్‌లు కాస్తంత బోర్ కొట్టేస్తున్నాయని వ్యాఖ్యానించారు. వన్డే ఫార్మెట్‍కు మార్పులు చేర్పులు చేయాలని ఆయన సూచించారు. టెస్టుల విషయంలోనూ ఆయన స్పందించారు. ఈ మ్యాచ్‌లు కూడా మరింత ఆకర్షణీయంగా సాగేలా చూడాలని ఆయన కోరారు. మ్యాచ్‌లు ఎన్నిరోజుల పాటు సాగిందన్న అంశానికి ప్రాధాన్యత లేదన్నారు. 
 
మ్యాచ్‌‌లపై ఆకర్షణీయత కొనసాగించేందుకు ఈ ఫార్మెట్‌పై ప్రజల దృష్టి మళ్లేలా కృషి చేయాలని ఆయన సూచించారు. ఇటీవల స్వదేశంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లు మూడున్నర రోజుల్లోనే ముగియడంపై అనేక మంది అసంతృప్తి వ్యక్తం చేస్తూ పెదవి విరిచిన విషయంతెల్సిందే. ఈ మ్యాచ్‌ల కోసం తయారు చేసిన పిచ్‌లపై విమర్శలు గుప్పించారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments