Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్డే మ్యాచ్‌లపై క్రికెట్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు

Webdunia
శనివారం, 18 మార్చి 2023 (12:11 IST)
భారత క్రికెటర్, లెజెండ్ సచిన్ టెండూల్కర్ వన్డే మ్యాచ్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇపుడు వన్డే మ్యాచ్‌లు బోరు కొట్టేస్తున్నాయంటూ వ్యాఖ్యానించి కలకలం రేపారు. తన వన్డే కెరీర్‌లో 50కిపైగా సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ నోట ఇటువంటి మాటలు రావడంతో ప్రతి ఒక్కరూ విస్తుపోతున్నారు.
 
వన్డే మ్యాచ్‌లు కాస్తంత బోర్ కొట్టేస్తున్నాయని వ్యాఖ్యానించారు. వన్డే ఫార్మెట్‍కు మార్పులు చేర్పులు చేయాలని ఆయన సూచించారు. టెస్టుల విషయంలోనూ ఆయన స్పందించారు. ఈ మ్యాచ్‌లు కూడా మరింత ఆకర్షణీయంగా సాగేలా చూడాలని ఆయన కోరారు. మ్యాచ్‌లు ఎన్నిరోజుల పాటు సాగిందన్న అంశానికి ప్రాధాన్యత లేదన్నారు. 
 
మ్యాచ్‌‌లపై ఆకర్షణీయత కొనసాగించేందుకు ఈ ఫార్మెట్‌పై ప్రజల దృష్టి మళ్లేలా కృషి చేయాలని ఆయన సూచించారు. ఇటీవల స్వదేశంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లు మూడున్నర రోజుల్లోనే ముగియడంపై అనేక మంది అసంతృప్తి వ్యక్తం చేస్తూ పెదవి విరిచిన విషయంతెల్సిందే. ఈ మ్యాచ్‌ల కోసం తయారు చేసిన పిచ్‌లపై విమర్శలు గుప్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గూగుల్ మ్యాప్ చెప్పినట్టుగా వెళ్లారు.. వరద నీటిలో చిక్కుకున్నారు...

19 ఏళ్ల కుర్రాడిని తీసుకుని 38 ఏళ్ల మహిళ జంప్, ఇద్దరూ బెంగళూరులో...

YS Viveka Case: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన వైఎస్ సునీతారెడ్డి.. ఈ కేసు క్లోజ్ కాకపోతే?

Midhun Reddy: ఏపీ మద్య కుంభకోణం-బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డి పిటిషన్

జగన్ ఆ విషయంలో నిష్ణాతుడు.. లిక్కర్ స్కామ్‌పై సమాధానం ఇవ్వాలి.. వైఎస్ షర్మిల

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

తర్వాతి కథనం
Show comments