కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ మనీ లాండరింగ్ కేసులో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు మూడు గంటల పాటు రికార్డు చేశారు. బీసీసీఐ తరపున శ్రీనివాసన్ ఫిర్యాదు దాఖలు చేసిన నేపథ్యంలో శ్రీనివాసన్ వాంగ్మూలాన్ని తీసుకున్నామని ఈడీ అధికారి చెప్పారు.
మారిషస్కు చెందిన ఓ కంపెనీ నుంచి రూ.21 కోట్లు అక్రమంగా మళ్లించారన్న కేసులో భాగంగా లలిత్ మోడీతో పాటు.. మరో ముగ్గురిపై ఫారెన్ ఎక్సేంజ్ వయోలేషన్ కేసు కింద ఈడీ తన దర్యాప్తును విస్తృతం చేసింది.
ఇదిలా ఉంటే మనీ లాండరింగ్ కేసులో లలిత్ మోడీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే, వరుణ్ గాంధీలతో పాటు పలువురు ప్రముఖుల పేర్లను మోడీ ఇరికించిన సంగతి తెలిసిందే.