Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు.. మీరే అతి చేస్తున్నారు.. : మీడియాపై సందీప్ పాటిల్ రుసరుసలు

Webdunia
మంగళవారం, 30 జూన్ 2015 (12:07 IST)
భారత టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ ధోనీ, వన్డే కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గునమండిపోతుందంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలపై బీసీసీఐ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ స్పందించారు. ధోనీ, కోహ్లీ మధ్య ఎలాంటి విభేదాలులేవన్నారు. 
 
బంగ్లాదేశ్ పర్యటన సమయంలో ధోనీ నిర్ణయాలను కోహ్లీ వ్యతిరేకించాడన్న కథనాలు అవాస్తవమని అన్నారు. అంతా మీడియా సృష్టి అని ఆరోపించారు. ఇక, బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ ఓటమి అనంతరం ధోనీ కెప్టెన్సీపై బోర్డులో ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. అటు, జట్టులోనూ ఎలాంటి విభేదాలు లేవన్నారు. 
 
అలాగే, వీరిద్దరి మధ్య సఖ్యత బాగానే ఉందన్నారు. ధోనీ, కోహ్లీ మధ్య విభేదాలు లేవని తేల్చి చెప్పారు. బంగ్లాదేశ్ పర్యటనలో వీరిద్దరి మధ్య విభేదాలు చెలరేగాయని, డ్రెస్సింగ్ రూంలో ఆటగాళ్లు రెండు వర్గాలుగా విడిపోయారంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. అవన్నీ ఊహాజనిత వార్తలని, విభేదాలన్నీ మీడియా వార్తల్లోనేనని చెప్పారు. 

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments