Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియాలో ఇంత లుకలుకలా? పెద్దమనిషి కుంబ్లే దూకుడు కోహ్లీకి నచ్చలేదా?

రత క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని సంచలనం. సాక్షాత్తూ కోచ్ అనిల్ కుంబ్లే అంటే టీమ్ లోని సీనియర్ ఆటగాళ్లకు నచ్చడం లేదన్న వార్తలు సంచలనం కలిగించాయి. తరాల మధ్య గ్యాప్ అనేది ఎక్కడైనా పనిచేస్తుందని సీనియర్ కోచ్‌కి, యవ్వనంలో ఉన్న కెప్టెన్, తదితర ఆటగాళ్లక

Webdunia
గురువారం, 1 జూన్ 2017 (02:16 IST)
భారత క్రికెట్  చరిత్రలో కనీవినీ ఎరుగని సంచలనం. సాక్షాత్తూ కోచ్ అనిల్ కుంబ్లే అంటే టీమ్ లోని సీనియర్ ఆటగాళ్లకు నచ్చడం లేదన్న వార్తలు సంచలనం కలిగించాయి. తరాల మధ్య గ్యాప్ అనేది ఎక్కడైనా పనిచేస్తుందని సీనియర్ కోచ్‌కి, యవ్వనంలో ఉన్న కెప్టెన్, తదితర ఆటగాళ్లకు మధ్య అభిప్రాయ భేదాలకు దృక్పథంలో తేడాలే కారణమని లెజెండరీ క్రికెటర్లు ఎంతగా సర్ది చెబుతున్నప్పటికీ సరిగ్గా చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనబోతున్న టీమిండియాకు ఇది మించిది కాదనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. దీంతో వేగంగా స్పందించిన భారత క్రికెట్ బోర్డు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, కోచ్‌ అనిల్‌ కుంబ్లే మధ్య ఏర్పడిన దూరాన్ని తగ్గించాలని నిర్ణయించింది.
 
మీడియాలో వస్తున్న వార్తల పట్ల స్పందించిన భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. ఎప్పుడైనా జట్టు కెప్టెన్, కోచ్‌ ఒకేలా ఆలోచిస్తారనుకోవడం సరికాదని, అలా ఎప్పుడూ జరగదని మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌ అన్నారు. కోహ్లి, కుంబ్లే మధ్య విభేదాల గురించి స్పందిస్తూ.. ‘అదంతా నిజమో కాదో తెలీదు కానీ చాంపియన్స్‌ ట్రోఫీ ముందు ఈ పరిస్థితి ఉండకూడదు. కచ్చితంగా కోచ్‌ అనే వ్యక్తి ప్రస్తుత తరంకన్నా ముందు ఆడినవారై ఉంటారు. అందుకే వారి దృక్పథం వేరేలా ఉంటుంది. ఇక జట్టు విజయాల గురించి మాట్లాడితే కుంబ్లే అద్భుతంగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రతీ కోచ్‌ జట్టు 10 ఏళ్ల భవిష్యత్‌ను ఊహించి పనిచేయాలి. కెప్టెన్, కోచ్‌లతో సీఏసీ సభ్యులు మాట్లాడతారని అనుకుంటున్నాను’ అని గావస్కర్‌ చెప్పారు.
 
చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా కీలకమైన పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు భారత జట్టులో నెలకొన్న విభేదాలపై బీసీసీఐలో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంట్లో భాగంగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, కోచ్‌ అనిల్‌ కుంబ్లే మధ్య ఏర్పడిన దూరాన్ని తగ్గించాలని బోర్డు నిర్ణయించింది. ఇందుకు బోర్డు సంయుక్త కార్యదర్శి అమితాబ్‌ చౌదరి, క్రికెట్‌ ఆపరేషన్స్‌ జీఎం ఎంవీ శ్రీధర్‌ను నియమించారు. వీరు బర్మింగ్‌హామ్‌లో ఇద్దరితో విడివిడిగా సమావేశమై విభేదాలను సద్దుమణిగేలా చేసేందుకు ప్రయత్నం చేయనున్నారు. 
 
మరోవైపు కొత్త కోచ్‌ ఎంపిక ప్రక్రియను ఈనెల 4న పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌ అనంతరం బీసీసీఐ ప్రారంభించనుంది. మే 31తో అభ్యర్థుల దరఖాస్తుల గడువు ముగిసింది.  చాంపియన్స్‌ ట్రోఫీ అనంతరం జట్టు వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లనుంది. ఆలోపునే జట్టు కోచ్‌ ఎవరనేది తేలిపోతుందని బోర్డు స్పష్టం చేసింది. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పెట్రోల్ బంకు సిబ్బంది ఛాతిపై తుపాకీ గురిపెట్టిన యువతి .. తర్వాత ఏమైంది (Video)

Rapido: ఎందుకలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నావ్..? ర్యాపిడో డ్రైవర్‌ను నిలదీసిన యువతికి చెంపదెబ్బ (video)

Sonia Gandhi: ఉదర రుగ్మతతో ఆస్పత్రిలో సోనియా గాంధీ: నిలకడగానే ఆరోగ్యం

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ పోటీలు : ఏసీబీ విచారణకు కేటీఆర్

ఇజ్రాయెల్ - ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు - విద్యార్థులకు భారత్ అలెర్ట్!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

తర్వాతి కథనం
Show comments