Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై సూపర్ కింగ్స్‍‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం.. రెండోసారి టైటిల్ వశం

Webdunia
సోమవారం, 25 మే 2015 (19:38 IST)
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ - 8 సీజన్ ఫైనల్ పోటీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై ముంబై ఇండియన్స్ జట్టు గెలుపొంది విజేతగా నిలిచింది. 
 
ఈ మ్యాచ్‌లో విజంయ సాధించి ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ టైటిలును ఎగరేసుకుపోవాలన్న ధోనీ సేన కల కలగానే ముంబై ఇండియన్స్ కుర్రోళ్లు మిగిల్చారు. ఐపీఎల్ పోరులో ఆరోసారి ఫైనలుకు చేరిన ఏకైక జట్టుగా ఉన్న చెన్నైలో డ్వేన్‌ స్మిత్‌, రైనా, ధోనీ వంటి హిట్టర్లున్నా ముంబై ముందు నిలువలేకపోయారు. 
 
టాస్ గెలిచి ప్రత్యర్థి జట్టుకు ధోనీ బ్యాటింగ్ అప్పగించి పెద్ద పొరపాటే చేశాడు. రెండో ఓవర్లో మొదలైన ముంబై బాదుడు చివరి వరకూ కొనసాగగా, నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 202 పరుగుల భారీ స్కోరు సాధించింది. లెండిల్‌ సిమన్స్‌ 68, రోహిత్‌ శర్మ 50 పరుగులతో అర్థ సెంచరీలు సాధించగా, కీరన్‌ పొలార్డ్‌ 36, అంబటి రాయుడు 36 (నాటౌట్‌)తో జట్టు స్కోరుని రెండొందలు దాటించారు. 
 
ఆ తర్వాత 203 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నై చతికిలపడింది. 161 పరుగులతో సరిపెట్టుకుంది. దీంతో ముంబై 41 పరుగుల తేడాతో విజయం సాధించి, విజేతగా నిలిచింది. ఇది ఆ జట్టుకు రెండో టైటిల్ కావడం గమనార్హం. గతంలో హర్భజన్ సింగ్ నేతృత్వంలో ఒకసారి, ఇపుడు రోహిత్ శర్మ సారథ్యంలో రెండోసారి టైటిల్ విజేతగా నిలిచింది. 

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

Show comments