Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ : సిడ్నీ చేరుకున్న ధోనీ - రోహిత్

Webdunia
బుధవారం, 9 జనవరి 2019 (15:20 IST)
ఆస్ట్రేలియా భారత్ క్రికెట్ జట్ల మధ్య వన్డే సిరీస్ ఈనెల 12వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఇందుకోసం భారత జట్టులో స్వల్ప మార్పులు చేశారు. ముఖ్యంగా, టెస్ట్ జట్టులోని కొంతమంది ఆటగాళ్లను తొలగించి వారి స్థానంలో పలువురు సీనియర్ క్రికెటర్లకు చోటుకల్పించారు.
 
ఈ నేపథ్యంలో ఈ వన్డే సిరీస్ కోసం మహేంద్ర సింగ్ ధోనీ, వన్డే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలు ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. తొలి వన్డేకు వేదికైన సిడ్నీ నగరానికి వారు చేరుకున్నారు. వీరివెంట యువ బౌలర్ యజువేంద్ర చాహల్ కూడా ఉన్నారు. రోహిత్, ధోనీతో కలిసి భారత్ నుంచి ఆస్ట్రేలియాకు బయలుదేరామని ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
 
మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డే శనివారం ఆరంభంకానుంది. టెస్టు సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన స్పీడ్‌స్టర్ బుమ్రా స్థానంలో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. సిరాజ్ కూడా త్వరలోనే జట్టుతో కలవనున్నాడు. మరోవైపు భారత సారథి విరాట్ కోహ్లీ టెస్టు సిరీస్ విజయాన్ని భార్య అనుష్క శర్మతో కలిసి ఆస్వాదిస్తున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Dalit Man : అక్రమ సంబంధం.. దళిత వ్యక్తిని కొట్టి, నగ్నంగా ఊరేగించారు..

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికలు- ఏకగ్రీవంగా ఐదుగురి ఎన్నిక

Half-Day Schools: హాఫ్-డే స్కూల్స్-తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన

Hyderabad: కర్ర, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌తో తల్లిని హత్య చేసిన కుమారుడు

స్నేహితుడుని చూసేందుకు వచ్చి అతని చేతిలోనే అత్యాచారానికిగురైన బ్రిటన్ మహిళ!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

తర్వాతి కథనం
Show comments