Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైకి చేరుకున్న ధోనీ.. ఐపీఎల్‌కు దూరమవుతాడా? ఏంటి సంగతి?

Webdunia
శనివారం, 15 ఆగస్టు 2020 (08:33 IST)
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రాంచీ నుంచి చెన్నైకి శుక్రవారం బయల్దేరాడు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. గత మార్చి నుంచి రాంచీలోని తన ఫామ్‌హౌస్‌కే పరిమితమైన ధోనీ.. శనివారం చెన్నై సూపర్ కింగ్స్ క్యాంప్‌నకి హాజరు కానున్నాడు.

యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ జరగనుండగా.. ఈ నెల 20 తర్వాత అన్ని జట్లూ అక్కడికి వెళ్లనున్నాయి. రెండు రోజుల క్రితం ధోనీకి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా.. నెగటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే.
 
అయితే మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌కి దూరం కానున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ధోని వయసు దాదాపు 40గా ఉండటంతో ఐపీఎల్‌కు దూరమవుతున్నాడని.. ఇంకా ధోని వ్యక్తిగత సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందుకే అతను ఐపీఎల్‌కి దూరం అయ్యే అవకాశం ఉంది అని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. 
 
ధోనీ ఇటీవల ఒక భూ సమస్యతో ఇబ్బంది పడుతున్నాడని సమాచారం దీనితో ధోనీ ఐపీఎల్‌కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. లాక్ డౌన్ సమయంలో ఈ సమస్య వచ్చింది అని, అది పరిష్కారం అయ్యే విధంగా లేదు అని కాబట్టి ఐపిఎల్‌లో ధోని కొన్ని మ్యాచ్‌లకు దూరం అయ్యే సూచనలు ఉన్నాయని చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments