మాజీ కెప్టెన్ ధోనీకి షాకిచ్చిన సుప్రీంకోర్టు

Webdunia
మంగళవారం, 26 జులై 2022 (11:53 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ధోనీకి సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఆయనకు సోమవారం నోటీసులు జారీచేసింది. అమ్రపాలి గ్రూపు కేసులో ఆయనకు ఈ నోటీసులు పంపించాల్సిందిగా ఆదేశించింది. అమ్రపాలి కంపెనీ తనకు రావాల్సిన రూ.40 కోట్ల పారితోషికాన్ని ఎగ్గొట్టిందని ఆరోపిస్తూ గత 2019లో మార్చి నెలలో ధోనీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 
 
అయితే, ఈ ఆర్థిక మధ్వర్తిత్వం చేయడానికి మాజీ న్యాయమూర్తిని కోర్టు మధ్యవర్తిగా నియమించింది. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు సూచించిన మధ్యవర్తిత్వాన్ని నిలిపివేయాలని సోమవారం సుప్రీంకోర్టు ఆదేశించారు. 
 
సోమవారం న్యాయమూర్తులు యూయు లలిత్, బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం పెండింగులో ఉన్న ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్‌ల గురించి తెలియజేసింది. ఇళ్ల కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడేందుకు, గృహ నిర్మాణ ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేసి, కొనుగోలుదారులకు ఇళ్లను అందజేసేందుకు కోర్టు రిసీవర్ను నియమించినట్లు పేర్కొంది.
 
కాగా, గతంలో అమ్రవాలి కన్‌స్ట్రక్షన్ కంపెనీకి ధోనీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. ఈ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్న రితి స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, అమ్రపాలి గ్రూపుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం మేరకు ధోనీకి చెల్లింపులు జరగలేదన్నది ప్రధాన ఆరోపణగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ASI: డ్రైవర్‌కు కళ్లు కనిపించలేదా? నీళ్ల ట్యాంకర్ ఢీకొని ఏఎస్ఐ మృతి

భార్య, వదిన, కుమార్తెలను కత్తితో పొడిచి హత్య.. ఆపై ఉరేసుకున్న వ్యక్తి.. ఎందుకిలా?

Jogi Ramesh: కల్తీ మద్యం కేసు: మాజీ మంత్రి, వైకాపా నేత జోగి రమేష్ అరెస్ట్

Happy Bride: ఇష్టపడి పెళ్లి చేసుకుంటే అమ్మాయిలు ఇలానే వుంటారు.. (video)

పులి కూనలను కళ్లల్లో పెట్టి చూసుకుంటున్న సావిత్రమ్మ.. తల్లి ప్రేమంటే ఇదేనా? వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

తర్వాతి కథనం
Show comments