Webdunia - Bharat's app for daily news and videos

Install App

దటీజ్ ధోనీ... ఫ్యాన్ పాదాభివందనం... తర్వాత... (వీడియో)

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఆయనకు వుండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.

Webdunia
గురువారం, 14 డిశెంబరు 2017 (16:22 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఆయనకు వుండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. కపిల్ దేవ్ తర్వాత భారత్‌కు ప్రపంచ కప్ అందించిపెట్టిన క్రికెట్ హీరో. అదీ కూడా.. ఒకటి కాదు.. రెండు ప్రపంచ కప్‌లు. 
 
అయితే, జట్టు నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ ధోనీ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. దీనికి నిదర్శనమే బుధవారం మొహాలీ వేదికగా శ్రీలంక - భారత్ మధ్య జరిగిన రెండో వన్డేలో జరిగిన ఈ ఘటనే. 
 
రెండో వన్డేలో శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ధోనీ అభిమాని ఒకరు భద్రతా వలయాన్ని ఛేదించుకుని మైదానంలోకి పరుగుపెట్టాడు. నేరుగా కీపింగ్ స్థానంలో ఉన్న ధోనీ వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చి కాళ్లపై పడి పాదాభివందనం చేశాడు. 
 
అనంతరం తన చేతిలో ఉన్న ఓ అట్టపై ధోనీని ఆటోగ్రాఫ్ పెట్టాల్సిందిగా కోరాడు. అయితే ధోనీ ఆ అభిమానిపై ఏమాత్రం విసుగు చెందకుండా ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. దీంతో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం ఏర్పడింది. వెంటనే అక్కడకు చేరుకున్న భద్రతా సిబ్బంది సదరు అభిమానిని అక్కడినుంచి లాక్కెళ్లారు.
 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments