Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహ్మద్ షమికి అర్జున అవార్డు - సాత్విక్ జోడీకి ఖేల్‌రత్న

Webdunia
బుధవారం, 20 డిశెంబరు 2023 (18:41 IST)
కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ 2023 సంవత్సరానికిగాను జాతీయ క్రీడా అవార్డులు ప్రకటించింది. భారత క్రికెటర్ మహ్మద్ షమీకి అర్జున అవార్డును ప్రకటించింది. అలాగే, స్టార్‌ బ్యాడ్మింటన్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌ శెట్టి దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ రత్నను అందుకోనున్నారు. అ ర్జున అవార్డుకు 26 మంది, ద్రోణాచార్య అవార్డు రెగ్యులర్ కేటగిరీలో ఐదుగురు ఎంపికయ్యారు. ఈ అవార్డులను జనవరి తొమ్మిదో తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేయనున్నారు. 
 
కాగా, అవార్డులు పొందిన వారి వివరాలను పరిశీలిస్తే, ఓజస్ ప్రవీణ్ (అర్చరీ), అదితి గోపీచంద్ స్వామి (అర్చరీ), శ్రీశంకర్ ఎం (అథ్లెటిక్స్‌), పారుల్ చౌదరి (అథ్లెటిక్స్), మహ్మద్‌ హుసాముద్దీన్‌ (బాక్సింగ్‌), ఆర్ వైశాలి (చెస్), మహ్మద్ షమి (క్రికెట్), అనూష్ అగర్వాలా (ఈక్వస్ట్రియన్‌), దివ్యకృతి సింగ్ (ఈక్వస్ట్రియన్‌ డ్రస్సెజ్‌), దీక్షా దాగర్ (గోల్ఫ్‌), క్రిషన్ బహదూర్ పాఠక్ (హకీ), సుశీల చాను (హకీ), పవన్ కుమార్ (కబడ్డీ), రితూ నేగి (కబడ్డీ), నస్రీన్ (ఖో ఖో), పింకి (లాన్ బౌల్స్), ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ (షూటింగ్), ఇషా సింగ్ (షూటింగ్), హరీందర్ పాల్ సింగ్ సంధు (స్క్వాష్‌), అహికా ముఖర్జీ (టేబుల్ టెన్నిస్), సునీల్ కుమార్ (రెజ్లింగ్), అంతిమ్ (రెజ్లింగ్), నౌరెమ్ రోషిబినా దేవి (వు షూ), శీతల్ దేవి (పారా అర్చరీ), అజయ్‌రెడ్డి (అంధుల క్రికెట్‌), ప్రాచీ యాదవ్ (పారా కానోయింగ్). 
 
ద్రోణాచార్య అవార్డులు 
రెగ్యులర్ కేటగిరీ: లలిత్ కుమార్‌ (రెజ్లింగ్), ఆర్‌.బి.రమేశ్ (చెస్), మహవీర్‌ ప్రసాద్ సైని (పారా అథ్లెటిక్స్‌), శివేంద్ర సింగ్ (హకీ), గణేష్ ప్రభాకర్ (మల్లఖాంబ్).
 
లైఫ్‌టైమ్‌ కేటగిరీ: జస్కీరత్ సింగ్ గ్రేవాల్ (గోల్ఫ్‌), భాస్కరన్ ఈ (కబడ్డీ), జయంత కుమార్ పుషీలాల్ (టేబుల్ టెన్నిస్).
 
జీవిత సాఫల్య పురస్కారం 2023: మంజుషా కన్వర్ (బ్యాడ్మింటన్), వినీత్ కుమార్‌ శర్మ (హకీ), కవిత సెల్వరాజ్ (కబడ్డీ). 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సంగారెడ్డిలో గంజాయి.. 30 గుంటల్లో సాగు చేశారు.. చివరికి?

నెల్లూరు పరువు హత్య.. యువతిని చంపి.. ఇంటి వద్దే పూడ్చేశారు..

ప్లీజ్... ముందస్తు బెయిల్ ఇవ్వండి : హైకోర్టులో కాంతిరాణా టాటా పిటిషన్

రూ.320కే నెయ్యి వస్తుందని శ్రీవారి లడ్డూను కల్తీ చేశారు : సీఎం చంద్రబాబు

తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో నాణ్యతా లోపం లేదు : ఏఆర్ డెయిరీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

తర్వాతి కథనం
Show comments