Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెల్‌బోర్న్ టెస్ట్ : రహానే అద్భుత సెంచరీ - భారత్ 276*/5

Webdunia
ఆదివారం, 27 డిశెంబరు 2020 (12:27 IST)
భారత్ - ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య మెల్‌బోర్న్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ అజింక్యా రహానే అద్భుతంగా రాణిస్తూ సెంచరీ చేశాడు. ఫలితంగా టీమిండియా 5 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. 
 
నిజానికి ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా కేవలం 195 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెల్సిందే. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఆతిథ్య జట్టు ఏ దశలోనూ కోలుకోలేకుండా పోయింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్... ఐదు వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది.
 
ఇందులో మయాంక్ అగర్వాల్ డకౌట్ కాగా, శుభ్‌మాన్ గిల్ 45, చటేశ్వర్ పుజారా 17 పరుగులకు ఔటయ్యారు. ఆ తర్వాత వచ్చిన అజింక్యా రహానె అద్భుతంగా రాణిస్తూ సెంచరీ చేశాడు. ఇది అతని టెస్ట్ కెరీర్‌లో 12వ సెంచరీ కావడం గమనార్హం. మొత్తం 195 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో వంద పరుగులు చేశాడు. 
 
అంతకుముందు హనుమాన్ విహారి 21, రిషబ్ పంత్ 29 పరుగులు చేసి ఓటయ్యారు. ప్రస్తుతం క్రీజులో అజింక్యా రహానె 104, రవీంద్ర జడేజా 35 పరుగులతో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, కమ్మిన్స్ రెండేసి వికెట్లు తీశారు. లైయాన్‌కు ఓ వికెట్ దక్కింది. ప్రస్తుతం టీమిండియా స్కోరు 276/5గా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: మూడు సంవత్సరాలు ఓపిక పట్టండి, నేను మళ్ళీ సీఎం అవుతాను.. జగన్ (video)

ట్రంప్ ఆంక్షల దెబ్బ: అమెరికాలో గుడివాడ టెక్కీ సూసైడ్

Amaravati Or Vizag?: ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి గుడ్ ఛాయిస్!?

Pawan Kalyan: నాకు డబ్బు అవసరమైనంత కాలం, నేను సినిమాల్లో నటిస్తూనే వుంటా: పవన్

Betting Apps: బెట్టింగ్ యాప్‌ల కేసులో పోలీసుల కీలక అడుగు.. ఆ జాబితాలో?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

తర్వాతి కథనం
Show comments