Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంజీ ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీ.. అదరగొట్టిన మనోజ్ తివారీ.. నాటౌట్

Webdunia
మంగళవారం, 21 జనవరి 2020 (11:51 IST)
రంజీ ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీ నమోదైంది. బెంగాల్ క్రికెటర్ మనోజ్ తివారీ తన బ్యాటుకు పనిచెప్పి విజృంభించాడు. త్రిశతకంతో ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. పశ్చిమ బెంగాల్-హైదరాబాదుల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో 414 బంతులు ఎదుర్కొన్న తివారీ 303 పరుగులు చేయడమేకాక నాటౌట్‌గా నిలిచాడు. తివారీ ఇన్నింగ్స్ లో 30 బౌండరీలు, 5 సిక్సర్లున్నాయి. 
 
పశ్చిమబెంగాల్ లోని బెంగాల్ క్రికెట్ మైదానం వేదికగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన బెంగాల్ జట్టు సోమవారం కూడా బ్యాటింగ్ చేసి ఏడు వికెట్లకు 635 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. నాలుగో బ్యాట్స్‌మన్‌గా క్రీజులోకి దిగిన తివారీ ఆదివారం మ్యాచ్‌లోనే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 
 
రెండో రోజైన సోమవారం ఆటలో రెండు సెంచరీలతో ట్రిపుల్ సెంచరీని సాధించాడు. కాగా మనోజ్ తివారీ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. భారత జట్టు తరపున 12 వన్డేలు, మూడీ టీ-20 మ్యాచ్‌లు ఆడాడు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments