Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిస్ కిస్ సే ప్యార్ కరూ ప్రివ్యూ షోను ఎంజాయ్ చేసిన టీమిండియా క్రికెటర్స్

Webdunia
శుక్రవారం, 25 సెప్టెంబరు 2015 (11:32 IST)
కామెడీ నైట్స్ విత్ కపిల్ టీవీ షోతో సెలబ్రిటీగా మారిన కపిల్ శర్మ ప్రధాన పాత్రధారిగా బాలీవుడ్‌లో ''కిస్ కిస్ సే ప్యార్ కరూ'' చిత్రం రూపుదిద్దుకుంది. ఈ చిత్ర నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. గురువారం బెంగళూరులో టీమిండియా క్రికెటర్ల కోసం చిత్ర నిర్మాతలు ఈ సినిమా ప్రివ్యూను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ధోనీ సహా మిగిలిన క్రికెటర్లంతా ఈ సినిమా చూసి ఎంజాయ్ చేశారట.
 
కాగా దక్షిణాఫ్రికా టూర్లో పాల్గొననున్న టీమిండియా క్రికెటర్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పటికే వన్డే, ట్వంటీ20 జట్లను బీసీసీఐ ప్రకటించిన నేపథ్యంలో మైదానంలోకి దూకేసిన క్రికెటర్లు కఠోర సాధన చేస్తున్నారు. 
 
రెండు ఫార్మాట్ల కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీతో పాటు వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా జట్టుకు ఎంపికైన సభ్యులంతా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ప్రాక్టీస్ సెషన్లకు క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. వీరు గురువారం కాస్త విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగానే కపిల్ శర్మ ప్రధాన పాత్రధారిగా నటించిన సినిమాను వీక్షించారు.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

Show comments