Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిట్నెస్ సాధించిన జాదవ్.. అంబటికి మొండిచేయి.. వరల్డ్ కప్ ఫైనల్ టీమ్ ఇదే..

Webdunia
మంగళవారం, 21 మే 2019 (09:40 IST)
ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా ఈ నెల 30వ తేదీ నుంచి ప్రపంచ క్రికెట్ పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీల కోసం భారత క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. మొత్తం 15 మందితో జట్టును పంపించింది. ఆ తర్వాత మరో ఇద్దరు ప్లేయర్లను స్టాండ్‌బైగా తీసుకుంది. అయితే, బీసీసీఐ తొలుత ప్రకటించిన జట్టునే ప్రపంచ కప్ పోటీలు అడేందుకు తుది జట్టుగా ఖరారు చేసింది. 
 
ముఖ్యంగా, ఐపీఎల్ 11వ సీజన్ పోటీల్లో గాయపడిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కేదార్ జాదవ్‌ తిరిగి ఫిట్నెస్ సాధించడంతో అతనికి తుది జట్టులో స్థానం కల్పించింది. జాదవ్ జట్టులోకి రావడంతో హైదరాబాద్ కుర్రోడు అంబటి రాయుడుకు తుది జట్టులో స్థానం లేకుండా పోయింది. ఫలితంగా రాయుడు తీవ్ర నిరాశకు లోనయ్యాడు. 
 
బీసీసీఐ ప్రకటించిన తుది జట్టులోని సభ్యుల వివరాలను పరిశీలిస్తే, విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, మహేంద్ర సింగ్ ధోనీ (వికెట్ కీపర్), కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్ (సెకండ్ వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments