Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ సీజన్ 9: వేలంపాటలో యువీకి ఆశించిన ధర రాలేదు.. రూ.7 కోట్లకే?

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2016 (11:29 IST)
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ 9వ సీజన్‌కు గాను వేలం పాట మొదలైంది. ఈ వేలంలో టీమిండియా స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు ఆశించిన ధర లభించలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాదు జట్లు యువీ కోసం హోరాహోరీగా పోరాడినా, అతడికి గత సీజన్‌లో లభించిన ధరలో సగం కూడా దక్కకపోవడం గమనార్హం. 
 
శనివారం ఉదయం బెంగళూరులో ప్రారంభమైన వేలంలో సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు యువీని కేవలం రూ.7 కోట్లకు దక్కించుకుంది. గత సీజన్‌లో యువీకి ఏకంగా రూ.16 కోట్ల ధర లభించింది. అంతకుముందు వేలంలో అతడికి రూ.12 కోట్లు లభించాయి. తాజా వేలంలోనూ యువీకి భారీ ధర పలుకుతుందని భావించినా, కేవలం రూ.7 కోట్లకే అతడిని సన్ రైజర్స్ యాజమాన్యం సొంతం చేసుకోవడం గమనార్హం. 
 
ఇకపోతే..ఐపీఎల్ తాజా సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు అదృశ్యం కాగా... వాటి స్థానంలో రాజ్ కోట్, పూణే జట్లు రంగంలోకి దిగనున్నాయి. తాజా ఐపీఎల్ సీజన్‌కు సంబంధించి శనివారం బెంగళూరులో ఆటగాళ్ల వేలం ప్రారంభమైంది. మొత్తం 351 మంది క్రికెటర్లు ఈ వేలానికి అందుబాటులో ఉంటారు. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments