Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2023 : ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు వేదికలు ఖరారు

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (20:36 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 పోటీల్లో భాగంగా, ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌ల నిర్వహణకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు వేదికలను ఖరారు చేసింది. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై, గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్‌లలో నాలుగు ఫ్లే ఆఫ్స్ మ్యాచ్‌లు నిర్వహిస్తామని బీసీసీఐ ప్రకటించింది. 
 
మే 23వ తేదీన క్వాలిఫయర్‌-1, 24వ తేదీన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లు చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా నిర్వహిస్తామని తెలిపింది. మే 26వ తేదీన క్వాలిఫయర్‌-2, 28వ తేదీన ఫైనల్‌ మ్యాచ్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతాయని బీసీసీఐ కార్యదర్శి జై షా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 
 
క్వాలిఫయర్ 1లో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచిన మొదటి రెండు జట్ల మధ్య మే 23వ తేదీన చెన్నైలో జరుగుతుంది. మ్యాచ్ 24న ఎలిమినేటర్ మ్యాచ్‌లో టీమ్ 3, టీమ్ 4 జట్ల మధ్య చెన్నైలో నిర్వహిస్తారు. 
 
మే 26వ తేదీన క్వాలిఫయర్ 2లో ఎలిమినేటర్ విజేత, క్వాలిఫయర్ ఒకటి ఓటమిపాలైన జట్ల మధ్య అహ్మదాబాద్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. 28వ తేదీన ఫైనల్ మ్యాచ్ క్వాలిఫయర్ ఒకటి విజేత, క్వాలిఫయర్ 2 విజేత జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా జరుగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Covid Alert: కేరళలో JN.1 వేరియంట్ ప్రభావం.. ఆరువేలకు పెరిగిన కేసులు

ప్రియుడు కావాలంటే అతడినే పెళ్లాడాలి, కానీ ఇలా భర్తను చంపేయడమేంటి? (video)

Jagan : కొమ్మినేని అరెస్ట్‌ను ఖండించిన జగన్.. యాంకర్‌ను శిక్షించడం అన్యాయం

RPF: కానిస్టేబుల్ దంపతులపై దుండగుల దాడి.. గర్భంతో వున్నానని చెప్పినా వదల్లేదు

లివింగ్ పార్టనర్ ఇంట్లో ఉరేసుకున్న మహిళ.. ఏం జరిగింది? హత్యా లేకుంటే..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

తర్వాతి కథనం
Show comments