Webdunia - Bharat's app for daily news and videos

Install App

బౌద్ధమతం స్వీకరించిన ఎంఎస్.ధోనీ?

Webdunia
సోమవారం, 15 మార్చి 2021 (09:06 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇపుడు సన్యాసిలా మారిపోయాడు. ఆయన బౌద్ధమతం స్వీకరించాడనే వార్తలు వినిపిస్తున్నాయి. లేదా ఏదైనా మత గురువులా మారి అడవుల్లోకి వెళ్లాడా? అనే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. దీనికి కారణం ధోనీ తాజా ఫోటోనే. 
 
నున్నగా గుండుతో సన్యాసులు ధరించే వస్త్రాలతో సరికొత్త అవతారంలో ధోని కనిపించడంతో అభిమానులందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఐపీఎల్‌ అధికారిక ప్రసారదారైన స్టార్‌స్పోర్ట్స్‌ ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఈ ఫొటో అంతర్జాలంలో చక్కర్లు కొడుతోంది. అయితే ఓ ప్రకటన కోసమే ధోనీని స్టార్‌స్పోర్ట్స్‌ ఇలా మార్చిందని సమాచారం. మైదానంలో ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే ఈ మాజీ సారథి.. ఇప్పుడిలా దర్శనమివ్వగానే నెటిజన్లు తమదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. 
 
మీమ్స్‌తో సందడి చేస్తున్నారు. 'ధోని ఎలా ఉన్నా.. ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటాడు', 'ఓపిక ప్రదర్శించడంలో సన్యాసిలా, ఆటలో యోధుడిలా ఉండడం ధోనీకే చెల్లుతుంది' అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. 
 
కెరీర్‌ ఆరంభం నుంచి కేశాలంకరణలో ధోనీ శైలి ఆకట్టుకుంటూనే ఉంది. మొదట్లో జులపాల జట్టుతో ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న అతను.. ఆ తర్వాత వివిధ అవతారాల్లో కనిపిస్తూనే ఉన్నాడు. వచ్చే నెలలో ఆరంభమయ్యే ఐపీఎల్‌-14 కోసం చెన్నైలో ధోని ప్రాక్టీస్‌ మొదలెట్టిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vijayawada: విజయవాడలో బాంబు కలకలం: అజ్ఞాత వ్యక్తి ఫోన్.. చివరికి?

Vallabhaneni Vamsi: పోలీసుల కస్టడీలో తీవ్ర అస్వస్థతకు గురైన వల్లభనేని వంశీ

లుకౌట్ నోటీసు దెబ్బకు కలుగులోని ఎలుక బయటకు వచ్చింది.. (Video)

గువ్వల చెరువు ఘాట్‌ రోడ్డు మలుపు వద్ద ఘోరం ... ఐదుగురు స్పాట్ డెడ్

వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం.. నిందితులంతా సహచరులే...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ చిత్రం డకాయిట్ - ఏక్ ప్రేమ్ కథ

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

తర్వాతి కథనం
Show comments